Bhagat Singh: భగత్ సింగ్లా నటించబోయి.. నిజంగానే ఉరేసుకున్నాడు..!
భారత స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నారులు చేస్తున్న నాటక ప్రదర్శన రిహార్సల్స్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్కు
లఖ్నవూ: భారత స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నారులు చేస్తున్న నాటక ప్రదర్శన రిహార్సల్స్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్కు సంబంధించిన నాటకంలో భాగంగా ఆయన్ను ఉరితీసే సన్నివేశాన్ని రిహార్సల్స్ చేస్తున్న పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్ప్రదేశ్లో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కువర్గావ్ జిల్లాకు చెందిన భూరే సింగ్ కుమారుడు శివమ్ తన మిత్రులతో కలిసి భగత్ సింగ్ను ఉరితీసిన సన్నివేశాన్ని సాధన చేస్తున్నాడు. అందులో భాగంగా ఉరితాడును అతడి మెడకు వేసుకున్నాడు. అదే సమయంలో కాళ్ల కింద ఉన్న చిన్న పీట జారిపోయి పక్కకు పడిపోవడంతో ఆ ఉరితాడు బాలుడి మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. దీంతో అక్కడున్న పిల్లలంతా కంగారుపడి కేకలు వేశారు. అది విని సమీపంలోని స్థానిక వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. బాలుడి మెడకు బిగుసుకున్న తాడును కత్తిరించి అతడిని కిందికి దింపాడు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి తల్లిదండ్రులు అతడికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మరణంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు అతడి కుటుంబం సుముఖంగా లేదని ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గ్రామానికి పోలీసుల బృందాన్ని పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు