Crime news: హైవేలపై కాపుకాస్తారు.. మహిళల్ని టార్గెట్ చేసి కాటేస్తారు!
జాతీయ రహదారులపై మహిళల్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడే ఓ కిరాతక ముఠాను రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లా పోలీసులు......
సీరియల్ గ్యాంగ్ రేప్ల ముఠా అరెస్ట్.. వీడియోలు స్వాధీనం
జైపూర్: జాతీయ రహదారులపై ప్రయాణించే మహిళల్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడే కిరాతక ముఠాను రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి కొన్ని అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజులకోసారి హైవేలపై ఇలాంటి నేరాలకు ఈ ముఠా తెగబడేదని పోలీసులు తెలిపారు. వీరంతా వరుస గ్యాంగ్ రేప్లకు పాల్పడినట్టు వీడియోలను బట్టి తెలుస్తోందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎనిమిది మందితో కూడిన ఈ ముఠాలో ఎక్కువ మంది 20 ఏళ్ల వయసు కలిగినవారేననీ.. వీరంతా దోపిడీ, అపహరణలకు పాల్పడుతుంటారని ప్రతాప్గఢ్ జిల్లా ఎస్పీ అమృతా దుహాన్ వెల్లడించారు. అరెస్టయిన ఐదుగురిలో మైనర్ కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. పలువురు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఓ పెట్రోల్ బంక్లో దోపిడీకి ప్రణాళిక రచిస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల నుంచి కారం, ఇనుపరాడ్, రెండు కర్రలు, కత్తులు, నైలాన్ తాడు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని అందరికీ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
వీరంతా కూరగాయల వ్యాపారంతో పాటు ధరియావాడ్లో చిన్న.. చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మద్యం మత్తులో ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి అత్యాచారాలకు ప్లాన్ వేసేవారని పేర్కొన్నాయి. ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి.. జంటలను లక్ష్యంగా మాటు వేసేవారని పోలీసులు తెలిపారు. దంపతులు కనబడగానే వ్యక్తిపై దాడిచేసి అతడి నుంచి దోచుకొని మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడేవారని వివరించారు. అనంతరం ఆ మహిళను గ్రామ శివారులలో వదిలి వెళ్లేవారు. అంతేకాకుండా ఈ దుశ్చర్యను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించేవారని .. పోలీసులకు ఈ విషయం చెబితే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తాంటూ బాధితులను బెదిరించేవారని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు