Telangana News: సినీ ఫక్కీలో బ్యాంకు చోరీ.. ₹3 కోట్ల సొమ్ము దోపిడీ

నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి

Updated : 04 Jul 2022 15:39 IST

బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌లోని గ్రామీణ బ్యాంకులో దొంగలు రూ.7 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బ్యాంకు పక్కనే ఉన్న బీఎస్‌ఎన్ఎల్‌ కార్యాలయం నుంచి దొంగులు బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు షట్టర్‌ను సినీ ఫక్కీలో గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి లోనికి ప్రవేశించారు. బ్యాంకులోని లాకర్లను సైతం గ్యాస్‌కట్టర్‌తో ధ్వంసం చేశారు. లాకర్‌లోని రూ.7లక్షల నగదు, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు సిబ్బంది అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని