Crime: రూ.కోటి ఖర్చు అయినా ఫర్వాలేదు. అతడు చనిపోవడం నాకు కావాలి..
కర్ణాటక కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. భాజపా నేత, కర్ణాటకలోని యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ను చంపేయండి అంటూ గోపాల్ కృష్ణ వేసిన మర్డర్ ప్లాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో గోపాల్ కృష్ణ సోఫా మీద కూర్చొని...
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. భాజపా నేత, కర్ణాటకలోని యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ను చంపేయండి అంటూ గోపాల్ కృష్ణ వేసిన మర్డర్ ప్లాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో గోపాల్ కృష్ణ సోఫా మీద కూర్చొని... ‘‘ఆ ఎమ్మెల్యే విశ్వనాథ్ను చంపేయండి. రూ.కోటి ఖర్చు అయినా ఫర్వాలేదు. అతడు చనిపోవడం నాకు కావాలి. దీని గురించి ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం మన మధ్యే ఉండాలి’’ అంటూ మరో వ్యక్తితో జరిపిన సంభాషణలు సంచలనంగా మారాయి. కాగా ఈ వీడియోని పరిశీలించిన పోలీసులు.. ఇది ఏ రోజున రికార్డు అయిందనే వివరాలు లేవని, గోపాల్కృష్ణపై తదుపరి విచారణ జరుపుతామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక హోంశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘‘ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నారు. విశ్వనాథ్ కూడా దీని గురించి నాతో మాట్లాడారు. ఆయనకు భద్రత కల్పిస్తాం. అయితే భద్రతా ఇవ్వాలా వద్దా అనేది ఇంటలిజెన్స్ విభాగం చేతుల్లో ఉంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?