AP News: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎర్రబాలెం చెరువులో కారు......

Updated : 18 Jan 2022 05:24 IST

మంగళగిరి: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మంగళగిరి మండలంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నాలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాయపాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తుండగా.. ఎర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న  సాయి, శ్రీనివాస్‌, నరేంద్ర కుమార్‌, తేజ రాంజీగా అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగులగొట్టి నలుగురిని బయటకు తీయగా.. అప్పటికే వారు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి, శ్రీనివాస్‌, నరేంద్ర మంగళగిరి వాసులు కాగా, తేజ రాంజీ ఎర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని