Crime News: ప్రేమించిందని ప్రాణం తీసింది

కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లి.. బిడ్డను హతమార్చిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపిన వివరాలు..

Updated : 04 Dec 2021 11:14 IST

నిద్రిస్తున్న కుమార్తెను హతమార్చిన తల్లి
వరంగల్‌ జిల్లాలో పరువు హత్య

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లి.. బిడ్డను హతమార్చిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపిన వివరాలు.. పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం జరిపించిన అనంతరం భర్త చనిపోవడంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తోంది. పదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అంజలి(17).. ఇదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తెను పలుమార్లు మందలించింది. అయినా మార్పు రాకపోవడంతో పెళ్లి చేసుకుంటే తన పరువుపోతుందని భావించిన సమ్మక్క తన తల్లి నాము యాకమ్మతో కలిసి గత నెల 19న అర్ధరాత్రి అంజలి గాఢనిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమ్మక్క, యాకమ్మలను విచారించగా కులాంతర వివాహం చేసేందుకు ఇష్టం లేకనే హత్య చేశామని ఒప్పుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని