kakinada: బెండపూడి వద్ద యాసిడ్‌ లారీ బీభత్సం.. హోంగార్డు మృతి

కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లారీ బీభత్సం సృష్టించింది.

Published : 13 Aug 2022 09:40 IST

తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లారీ బీభత్సం సృష్టించింది. యాసిడ్‌ లోడ్‌తో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ట్యాంకర్‌.. బెండపూడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఆగిఉన్న లారీతో పాటు రోడ్డుపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోంగార్డు గోవిందరాజులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని