Road Accident: నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కడెం మండలం బెల్లాల్‌ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.

Published : 20 Jan 2022 02:01 IST

కడెం: ఆటో బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలం బెల్లాల్‌ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడెం నుంచి బెల్లాల్‌ వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్ద బెల్లాల్‌కు చెందిన సీమల శాంత(55), అన్నాపూర్‌ గ్రామానికి చెందిన శంకరవ్వ (52), మల్లన్నపేటకు చెందిన మల్లయ్య (55) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు. ఖానాపూర్‌ సీఐ అజయ్‌ బాబు, కడెం ఎస్సై రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని