Crime News:లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 10 మందికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. 

Published : 16 Jan 2022 03:34 IST

ఉంగుటూరు‌: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు భీమడోలు జంక్షన్ వద్దకు రాగానే రోడ్డుప్రక్కన ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్‌ఐ వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని