Crime News: పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్!
ఘల్లుఘల్లున గజ్జెల శబ్దంతో.. చిన్నారి ఇల్లంతా చేస్తున్న సందడితో సంబరపడాల్సిన తండ్రి.. ఆ బుజ్జాయి కాళ్లకు కరెంటు షాక్ పెట్టి నిండు ప్రాణాలు తీశాడు. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన
కాటేసిన కన్నతండ్రి క్రూరత్వం
తానూ ఆత్మహత్యాయత్నం
భార్యపై అనుమానమే నేపథ్యం
తొగుట, న్యూస్టుడే: ఘల్లుఘల్లున గజ్జెల శబ్దంతో.. చిన్నారి ఇల్లంతా చేస్తున్న సందడితో సంబరపడాల్సిన తండ్రి.. ఆ బుజ్జాయి కాళ్లకు కరెంటు షాక్ పెట్టి నిండు ప్రాణాలు తీశాడు. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం జరిగింది. దౌల్తాబాద్కు చెందిన సునీతను రెండేళ్ల కిందట వెంకట్రావుపేటకు చెందిన ఎం.రాజశేఖర్ వివాహమాడాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగగా పాప పుట్టింది. అప్పటి నుంచీ సునీతపై రాజశేఖర్, అతడి తల్లిదండ్రులు నర్సవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య అనుమానం వ్యక్తం చేస్తూ కొట్లాట పెట్టుకుంటున్నారు.చివరకు రాజశేఖర్, సునీత అద్దె ఇల్లు చూసుకున్నారు. కొద్దిరోజులకే భర్త మనసు మార్చుకొని తల్లిదండ్రుల వద్దే ఉందామంటూ భార్యతో ఘర్షణ పడుతున్నాడు. భార్యను ఇదే విషయమై శుక్రవారం తిట్టి, కొట్టి.. కుమార్తె ప్రిన్సీ (11 నెలలు)ని ఎత్తుకొని కౌలు భూమి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సీ కాళ్ల గజ్జెలకు తీగలు చుట్టి మోటారు స్టార్టర్ నుంచి విద్యుత్తు సరఫరా అయ్యేలా చేశాడు. షాక్తో చిన్నారి కన్నుమూసింది. రాజశేఖర్ అక్కడే పురుగుల మందు తాగాడు.. మరో రైతుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ రైతు గ్రామస్థులకు సమాచారం అందించి వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కరెంట్ షాక్తో మాడిపోయిన పసికందు పాదాల్ని, కాలిగజ్జెల్ని చూసి తల్లి సునీత గుండెలు బాదుకుంది. నిందితుడు రాజశేఖర్ను చికిత్స కోసం ములుగు ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!