Crime News: తండ్రి పైశాచికం.. మద్యం తాగించి కూతురిపై అఘాయిత్యం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. కూతురిపైనే అత్యాచారం చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి కన్నకూతురిని

Published : 04 Oct 2021 07:25 IST

మార్కాపురం గడియార స్తంభం న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. కూతురిపైనే అత్యాచారం చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి కన్నకూతురిని తీసుకెళ్లి.. బాలికకు బలవంతంగా మద్యం తాగించి మత్తులో ఉండగా 2రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాన్ని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వీడియో తీయడం పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సభ్య సమాజానికి తలవంపుగా నిలిచింది. వివరాలను డీఎస్పీ కిశోర్‌కుమార్‌ విలేకరులకు ఆదివారం తెలిపారు. మార్కాపురంలో నివసించే వ్యక్తి కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధమేర్పడింది. గత జులై రెండో వారంలో తన 15ఏళ్ల కుమార్తెను మార్కాపురం నుంచి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు మహిళతో కలిసి బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. దాన్ని మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. అనంతరం ఆమెను ప్రకాశం జిల్లాలో మరో చోట తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంకో మహిళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. నెలన్నరపాటు అక్కడే ఉంచాడు. సొంత భార్యకు మాత్రం కుమార్తె తన వద్దే ఉందంటూ మభ్యపెడుతూ ఫోన్‌లో మాట్లాడించేవాడు. సెప్టెంబరు రెండో వారంలో ఓ బంధువు చనిపోతే కార్యక్రమానికి కూతురితో కలిసి తండ్రి వచ్చాడు. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. భర్త వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయని గుర్తించిన ఆమె చివరకు కూతురిపై అత్యాచారం గురించి గత సెప్టెంబరు 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని