AP News: చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి మృతి

ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది...

Updated : 20 Oct 2021 16:18 IST

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులోని మిగతా విద్యార్థులను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాజు(8) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులన్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో పడిన కొంగర గ్రామానికి చెందిన బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామానికి చెందిన ప్రజలు చెరువు వద్దకు భారీగా చేరుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని