NCRB Report: పెరిగిన ఆత్మహత్యలు.. నిత్యం 418 మంది బలవన్మరణం!
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. వివిధ కారణాలతో గతేడాది మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది.
జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆత్మహత్యలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది. నిత్యం 418 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపింది. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మరణాలు ఎక్కువ నమోదయ్యాయి. 2019లో మొత్తం లక్షా 39వేల మంది ప్రాణాలు తీసుకోగా 2020లో ఈ సంఖ్య లక్షా 53 వేలకు పెరిగింది. ప్రతి పదిలక్షల జనాభాకు 10.4గా ఉన్న ఆత్మహత్యల రేటు 11.3కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో అత్యధికం..
దేశంలో అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయి. 2020లో అక్కడ 19వేల (19,909) మంది ప్రాణాలు తీసుకున్నారు. తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 16,883 మంది, మధ్యప్రదేశ్లో 14,578, పశ్చిమబెంగాల్లో 13,103, కర్ణాటకలో 12,259 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలో గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.1శాతం ఉన్నాయి. మిగతా 49.9 శాతం మరణాలు మిగిలిన 23 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవించాయి. అయితే, దేశ జనాభాలో దాదాపు 17 శాతం ఉత్తర్ప్రదేశ్లో ఉండగా అక్కడ ఆత్మహత్యల రేటు (3.1శాతం) కాస్త తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం. ఇక నగరాల విషయానికొస్తే.. దేశ రాజధాని దిల్లీలో ఎక్కువ ఆత్మహత్యలు (3,142) చోటుచేసుకున్నాయి.
కుటుంబ సమస్యలతోనే ఎక్కువ..
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, మహానగరాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు సంభవించాయి. దేశంలో గతేడాది 53 నగరాల్లో 23,855 (14.8) మంది ప్రాణాలు కోల్పోగా.. ఇది జాతీయ సగటు (11.3) కంటే ఎక్కువ. అయితే, బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని తాజా నివేదిక పేర్కొంది. గతేడాది ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 33.6 శాతం కుటుంబ సమస్యలతోనే ప్రాణాలు విడిచారు. అనారోగ్యం కారణాలతో 18 శాతం, వివాహానికి సంబంధించిన సమస్యలతో 5 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఇక ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల్లో 70.9 శాతం మంది పురుషులే కాగా.. 29.1 శాతం మహిళలు ఉన్నారు.
ఏడాదిలోనే 10శాతం పెరిగిన ఆత్మహత్యలు..
ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి, గృహిణిలే ఎక్కువగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ప్రాణాలు తీసుకోగా 2017లో ఆ సంఖ్య లక్షా 29 వేలకు తగ్గింది. అనంతరం తదుపరి సంవత్సరాల్లో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2018లో 1,34,516 మంది, 2019లో 1,39,123 మంది ఆత్మహత్యకు పాల్పడగా 2020లో ఏకంగా లక్షా 53వేల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. మునుపటి ఏడాదితో పోలిస్తే ఏకంగా పదిశాతం ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..