Crime News: అలారం నొక్కారు.. అడ్డంగా బుక్కయ్యారు!

సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో దోపిడీకి యత్నించిన ముగ్గురు నిందితులను తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్ర అమ్‌సుత్‌దాన్‌ అయోధ్యనగర్‌కు

Updated : 30 Nov 2021 06:45 IST

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి విఫలయత్నం 

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో దోపిడీకి యత్నించిన ముగ్గురు నిందితులను తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్ర అమ్‌సుత్‌దాన్‌ అయోధ్యనగర్‌కు చెందిన లక్ష్మణ్‌(45), ముంబయి ధారావికి చెందిన అశోక్‌(43), మహారాష్ట్ర కాసర్‌గఢ్‌కు చెందిన ప్రభేడ్‌ బాలకృష్ణన్‌(23)లు సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తిరుమలగిరి ఆర్టీసీకాలనీలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడటానికి యత్నించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముఠా సభ్యులను ముందే గమనించిన సంస్థ సిబ్బంది వెంటనే అలారం నొక్కారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, సిబ్బంది కలిసి నిందితులను వెంబడించారు. నిందితులు ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి ఎల్‌ఐసీ బిల్డింగ్‌ వైపు పరుగులు తీస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద మారణాయుధాలు కూడా లభ్యమవ్వడంతో వెంటనే తిరుమలగిరి లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని