Road Accident: నల్గొండ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముల్యాలమ్మగూడెం శివారులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు.
కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం శివారులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలం అయ్యపురాజుపాలెంకు చెందిన కదిరి గోపాల్రెడ్డి (31) రాజస్థాన్ రాష్ట్రంలో మైనింగ్శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య రచన(31), కూతురు రియాన్సితో అక్కడ 9ఏళ్లుగా నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా రాష్ట్రంలో ఉద్యోగం రావడంతో రాజస్థాన్లోని ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి అంతా హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. కట్టంగూరు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ముందున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొని.. ఆపై రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాల్రెడ్డి, ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రచన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. చిన్నారి రియాన్సీ స్వల్పగాయాలతో చికిత్స పొందుతోంది.
మరో ప్రమాదం.. ఇద్దరు మృతి
చెట్టు ఢీకొట్టిన కారులో రచన, రియాన్సీ ఇరుక్కుపోయారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరిన జంగం శివప్రసాద్ (23), రోమాల వినయ్(21)లు ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగం శివప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. వినయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వీరిద్దరూ కారులో సూర్యాపేటలోని ఓ ఆశ్రమంలో నిర్వహిస్తున్న రుద్రాభిషేకానికి హాజరవుతున్నారు. సీఐ నాగదుర్గా ప్రసాద్, ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?