‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
వరుస అంటువ్యాధులు వెంటాడుతోన్న వేళ.. డిసీజ్ ఎక్స్ (Disease X)వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బ్రిటన్ శాస్త్రవేత్తల ముందస్తు హెచ్చరిక
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ (Coronavirus), మంకీపాక్స్ (Monkeypox) వంటి వ్యాధులు ప్రబలంగా విస్తరిస్తోన్న వేళ.. రానున్న రోజుల్లో మరో మహమ్మారి ముప్పు పొంచివుందనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బ్రిటన్లో మురికినీటి నమూనాల్లో ఇటీవల పోలియోవైరస్ (Poliovirus) గుర్తించడం మరింత కలవరపాటుకు గురిచేసింది. అయితే, పోలియోను ఎదుర్కొనే వ్యాక్సిన్ విస్తృతంగా పంపిణీ చేసినందున పోలియో వ్యాప్తించే ప్రమాదమేమీ లేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
బ్రిటన్ను వెంటాడుతోన్న అంటువ్యాధులు..
కరోనా వైరస్తో వణికిపోయిన బ్రిటన్లో ఇటీవల మంకీపాక్స్ వ్యాధి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కేసులు నిర్ధారణ కాగా గుర్తించనివి మరిన్ని ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాధికంటే ముందు క్రిమియన్-కాంగో జ్వరం (Congo Fever) కేసులు నమోదుకావడం బ్రిటన్ను కలవరపెట్టింది. ఇటీవలి కాలంలో లాస్సా ఫీవర్ (Lassa Fever), బర్డ్ ఫ్లూ (Bird Flu) వంటి కేసులు కూడా బ్రిటన్ను వణికించాయి. ఇలా వరుసగా అంటువ్యాధులు వెలుగు చూస్తుండడంపై స్పందించిన నిపుణులు.. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు. ఇలా వరుస అంటువ్యాధులు వెంటాడుతోన్న వేళ.. డిసీజ్ ఎక్స్ (Disease X)వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు అక్కడి ప్రభుత్వానికి సూచించారు.
ఏమిటీ డిసీజ్ ఎక్స్..?
డిసీజ్ ఎక్స్లో X అంటే భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారికి కారణమయ్యే వ్యాధికారకాలను సూచిస్తుంది. దీనివల్ల ప్రపంచస్థాయిలో తీవ్రమైన అంటువ్యాధులు సంభవిస్తాయి. అది ఏరకమైన వ్యాధి అనే విషయం కచ్చితంగా తెలియనప్పటికీ వ్యాధి ప్రాబల్యం మాత్రం అధికంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల ప్రస్తావించింది. ‘డిసీజ్ ‘ఎక్స్’ అనేది ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన, అంటువ్యాధి. అది ఒకవేళ సంభవిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురకాల కరోనా వైరస్లు, ఇంకా గుర్తించబడని ‘డిసీజ్ ఎక్స్’తోపాటు ప్రాధాన్యత కలిగిన వ్యాధులను అంచనా వేసేందుకు పరిశోధక రోడ్మ్యాపులు, ప్రయోగ నమూనాలను అభివృద్ధి చేశాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (మార్చి నెలలో) వెల్లడించింది.
కరోనా కంటే వినాశకారీ..?
జంతువుల నుంచి మానవులకు సోకే (Zoonotic) ఎన్నో వ్యాధులు రానున్న రోజుల్లో విరుచుకుపడొచ్చని గతంలో ఎంతోమంది నిపుణులు స్పష్టంగా పేర్కొన్నారు. ‘21వ శతాబ్దం ఆరంభంలో అంటువ్యాధులు ఓ తుపానులా విరుచుకుపడ్డాయి. రానున్న రోజుల్లోనూ ఇవి మరింతగా వ్యాప్తిచెందే ఆస్కారం ఉందని సూచిస్తున్నాయి’ అని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్కి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ వూల్హౌజ్ పేర్కొన్నారు.
మనం సరికొత్త రోగకారక జీవుల యుగంలో జీవిస్తున్నామని.. డిసీజ్ ఎక్స్ కూడా అందులోని భాగమేనంటూ 1976లో ఎబోలా (Ebola)ను కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రాఫెసర్ జీన్జాక్యూస్ ముయేంబే టామ్ఫమ్ గతేడాదే హెచ్చరించారు. ఇటువంటి పరిణామాలు మానవాళికి ముప్పు కలిగించేవేనని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ కంటే వినాశకరమైన కొత్త వ్యాధులు ఉద్భవిస్తాయా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. అటువంటివి కచ్చితంగా వస్తాయనే తాను భావిస్తున్నానని చెప్పారు. ఏదేమైనా భవిష్యత్తులో ఉద్భవించే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్