Mystery House On Moon: చంద్రుడిపై ఓ ‘మిస్టరీ హౌస్’?
చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది....
ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందన్న వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చైనా 2019లో చంద్రుడిపైకి పంపిన ‘యుటు-2’ అనే రోవర్ ఇటీవల కొన్ని చిత్రాలు పంపింది. అందులో ఘనాకారంలో ఉన్న ఓ వస్తువు కనిపించినట్లు ఆండ్రూ జోన్స్ అనే స్పేస్ జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ‘మిస్టరీ హౌస్’గా వ్యవహరిస్తుండడం గమనార్హం.
యుటు-2 రోవర్ ‘వోన్ కార్మన్’ అనే క్రేటర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించినట్లు ఆండ్రూ పేర్కొన్నారు. ప్రస్తుతం అది రోవర్కు 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే, అది స్తంభమో లేక ఏలియనో కాదని పేర్కొన్నారు. మరైతే అది ఏంటనేది మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2-3 ‘ల్యూనార్ డేస్’(దాదాపు 2-3 నెలలు)లో రోవర్ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. ఉల్కలు, గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు బయటపడుతుంటాయన్నారు. చైనా పంపిన ఛాంగ్ ఇ-3 మిషన్లోనూ ఇలాంటిది కనిపించినట్లు తెలిపారు. కానీ, అది ఓ పెద్ద బండరాయని తర్వాత తెలిసిందన్నారు.
ఇలా చంద్రుడికి సంబంధించి రోవర్లు పంపే చిత్రాల్లో ఏదో వింత ఆకారాలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో యుటు-2 పంపిన ఫొటోల్లో ఆకుపచ్చ రంగులో జెల్ లాంటి పదార్థం ఒకటి కనిపించింది. తర్వాత జరిపిన పరిశోధనల్లో దాన్ని రాయిగా నిర్ధారించారు. ఇటీవల ఓ పెద్ద మేకు లాంటి ఆకారం కూడా కనిపించింది. అది కూడా రాయే అని తేలింది. ఆండ్రూ జేమ్స్.. చైనా అంతరిక్ష కార్యకలాపాల్ని రిపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన స్పేస్.కామ్ అనే వార్తా సంస్థకు పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు