అమ్మమ్మ షరతు.. బతికొచ్చిన బాలుడు
బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి
చండీగఢ్: బతికుండగానే ఆ బాలుడు మృతిచెందినట్లు ధ్రువీకరించారు దిల్లీ వైద్యులు. దీంతో తమ ఏడేళ్ల కుమారుడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. అయితే అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అతడి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన హరియాణాలోని జజ్జర్ జిల్లాలో వెలుగుచూసింది. కిలా ప్రాంతానికి చెందిన విజయ్ శర్మ మనవడు కునాల్ శర్మ టైఫాయిడ్తో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బహదూర్గంజ్లోని బాలుడి మామ ఇంటి సమీపంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే వేరే ప్రాంతంలో ఉంటున్న బాలుడి అమ్మమ్మ.. తన మనవడిని కడసారి చూడాలని పట్టుబట్టింది. తాను వచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అందరూ ఆమె రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తల్లి ఏడుస్తూ బాలుడి శవపేటికను తాకింది. కాగా ఆ శవపేటికలో కదలికలు గుర్తించిన తల్లి విషయాన్ని బాలుడి తండ్రి హితేష్కు చెప్పింది. శవపేటిక నుంచి కొడుకును బయటకు తీసిన తండ్రి.. నోటి ద్వారా శ్వాస అందించడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి గుండెమీద గట్టిగా అదుముతూ ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం వెంటనే బాలుడిని రోహ్తక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
తొలుత కునాల్ శర్మ బతికేందుకు 15 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా క్రమంగా బాలుడు కోలుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ మృత్యుంజయుడు. అమ్మమ్మ షరతుతో అంత్యక్రియలు ఆలస్యం కావడం.. ఈ క్రమంలో అనూహ్య రీతిలో ఆ పిల్లవాడిలో కదలికలు రావడం.. అతడు బతికి బయటపడటంతో ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ