Covid-19: గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?
మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్
వాషింగ్టన్: మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో గత ఏడాది ఈ వివరాలు ప్రచురించారు. కరోనా సోకిన తర్వాత చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుండటంతో పరిశోధకులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేసి చంపేయడంతో దాని ప్రభావం గుండె సంకోచ వ్యాకోచాలపై పడుతున్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. సాధారంగా ఇలాంటి పరిస్థితుల్లో గుండెలో మంట వస్తుంది. కానీ కరోనా కారణంగా ఈ సమస్య ఎదురైతే మంట వంటి లక్షణాలు కూడా కనిపించట్లేదని పరిశోధనలో పాల్గొన్న కోరీ జె లావినె తెలిపారు.
కరోనా వైరస్ ప్రధానంగా గుండె లోపలి కణాలతో పాటు, రోగ నిరోధక వ్యవస్థలోని టి, బి కణాలపై దాడి చేస్తుందన్నారు. ఇతర వైరస్లతో పోలిస్తే కరోనా దాడి చేయడం వల్ల గుండె భిన్నంగా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. యువకుల్లో వారు చేసే శారీరక శ్రమ ఆధారంగా లక్షణాల్లో స్వల్ప మార్పులుంటాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!