Marriage: నుదుట బొట్టును తుడిపించి.. ఆరు గంటల్లోనే పెటాకులైన ప్రేమ పెళ్లి
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఓ కుర్రాడిని గమనించిన ఇంటి యజమాని దొంగా దొంగా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుర్రాడు బయటకు పరుగులు తీశాడు. యజమాని అరుపులు విన్న గ్రామస్థులు యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడేమోనని
రాంచీ: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఓ కుర్రాడిని గమనించిన ఇంటి యజమాని దొంగా దొంగా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుర్రాడు బయటకు పరుగులు తీశాడు. యజమాని అరుపులు విన్న గ్రామస్థులు యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడేమోనని చితకబాదబోయారు. ఇంతలోనే ఆ కుర్రాడు అసలు విషయం చెప్పాడు. తాను దొంగతనానికి రాలేదని.. ఆ ఇంట్లో ఉండే తన ప్రేయసిని కలిసేందుకు వచ్చానని తెలిపాడు. ఇది విన్న వారంతా ఆ అమ్మాయిని పిలిపించి నిజమా? కాదా అని అడిగారు. అతడు తన ప్రియుడేనని ఆ యువతి బదులిచ్చింది.
దీంతో గ్రామస్థులంతా కలిసి వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి పిలిపించారు. అప్పటికప్పుడు ఊరి మధ్యలో అందరి సమక్షంలో వివాహం జరిపించారు. వారి సంప్రదాయం ప్రకారం అబ్బాయి.. అమ్మాయి నుదుటన బొట్టు పెడితే వివాహం జరిగినట్లే. అలా పెళ్లి తంతు ముగిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు కుటంబాలను పోలీస్స్టేషన్కు పిలిపించి ఆరా తీశారు. విచారణలో అమ్మాయికి 19 ఏళ్లు, అబ్బాయికి 16 ఏళ్లే అని తెలిసింది. బాలుడిని పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం చెల్లదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో గ్రామపెద్దలు పెళ్లి రద్దు చేయించారు. అమ్మాయి నుదిటికి పెట్టిన బొట్టును అబ్బాయితోనే తుడిపించారు.
ఝార్ఖండ్లోని గఢ్వా పట్టణానికి సమీపంలో ఉన్న మఝిగవా గ్రామంలో శనివారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం వారికి వివాహం జరిపించగా.. మధ్యాహ్నం వారిని పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అనంతరం వివాహం రద్దయ్యింది. పెళ్లి జరిగిన 6 గంటల్లోనే ఆ వివాహం రద్దవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్