అమ్మానాన్నలతో గొడవ.. ఆరేళ్ల నుంచి సొరంగంలో!

ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడిన పిల్లలు సాధారంగా ఏంచేస్తారు? కాసేపు అలుగుతారు. తినడం మానేస్తారు. లేదా బయటకు వెళ్లి కోపం తగ్గాక తిరిగొస్తారు. కానీ స్పెయిన్​కు చెందిన ఓ కుర్రాడు మాత్రం సొరంగం తవ్వాడు....

Published : 06 Jun 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడిన పిల్లలు సాధారంగా ఏంచేస్తారు? కాసేపు అలుగుతారు. తినడం మానేస్తారు. లేదా బయటకు వెళ్లి కోపం తగ్గాక తిరిగొస్తారు. కానీ స్పెయిన్​కు చెందిన ఓ కుర్రాడు మాత్రం సొరంగం తవ్వాడు. ఆరేళ్ల పాటు అదే పనిలో నిమగ్నమై ఏకంగా భూగర్భంలోనే సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఇప్పడు ఆ ఇంట్లో పడుకోవడానికి బెడ్డు, వైఫైతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్​ను ఊపేసిన ఆ యువకుడి కథేంటో ఓసారి చూసేద్దాం..

స్పెయిన్‌కు చెందిన అండ్రెస్ కాంటో తన 14వ ఏట 2015 మార్చిలో ఓ రోజు అమ్మానాన్నలతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అదే కోపంతో ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లి తన తాత ఉపయోగించిన పార చేతబట్టి తవ్వడం మొదలుపెట్టాడు. అలా రోజూ తవ్వుతూనే ఉన్నాడు. అలా ఆరేళ్లపాటు శ్రమించి ఏకంగా భూగర్భంలోనే సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. 2018 వరకు పారతో తవ్వుతూ బకెట్​తో మట్టిని బయటపడేసే అండ్రెస్​కు 2018 నుంచి తన మిత్రుడు అండ్రూ సహకారం లభించింది. అతడు తెచ్చిన డ్రిల్లర్​, చిన్నపాటి లిఫ్టింగ్ యంత్రంతో అండ్రెస్ పని మరింత సులభమైంది. వారానికి 14 గంటలు శ్రమించి సొరంగం తవ్వాడు. ఈ యువకుడు నిర్మించిన అండర్​గ్రౌండ్ ఇంటిని ట్విట్టర్​లో పోస్ట్ చేయగా అది వైరల్​గా మారింది. కొన్ని న్యూస్ ఛానళ్లు అండ్రెస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి.

తన ఇంట్లో ఇప్పుడు పడుకోవడానికి బెడ్‌, వైఫై సదుపాయం కూడా ఉందని అండ్రెస్ పేర్కొంటున్నాడు. బయట ఎంత వేడిగా ఉన్నా లోపల చల్లాగా ఉందంటున్నాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్న సమయానికి ఇల్లు సిద్ధమైందని చెబుతున్నాడు. వర్షాలు కురిసినప్పుడు మాత్రం ఇంట్లోకి పురుగులు, నత్తలు వస్తాయని వివరించాడు. అయితే ఇంత శ్రమించి ఇల్లు కట్టుకోవాడనికి ప్రత్యేక కారణమేమైనా ఉందా అంటే.. తనకు గుర్తు లేదని బదులిచ్చాడు అండ్రెస్. కానీ ప్రతిరోజు అలసట లేకుండా తవ్వేందుకు తనంతట తానే స్ఫూర్తి పొందేవాడినని పేర్కొన్నాడు. తాను కాల్పనిక శక్తి ఉన్న కుర్రాడినని బదులిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని