Students: ఈ చిన్నారుల చేతులు అద్భుతం చేశాయ్!
తమ స్కూల్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని కోరుతూ ఇద్దరు చిన్నారులు కలెక్టర్కు రాసిన లేఖ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది...
చెన్నై: చెన్నైకి చెందిన ఇద్దరు చిన్నారులు అద్భుతం చేశారు. ఎలాగైనా మందుబాబుల బెడద నుంచి తమ స్కూల్ని రక్షించాలని సంకల్పించారు. తమ ఆలోచనకు.. పెన్నుకున్న పవర్ను జోడించారు. ఏకంగా కలెక్టర్కే లేఖ రాశారు. మంచి చేసే వారికి మంచే జరుగుతుంది కదా మరి! అందుకే వారి నిర్మలమైన మనస్సుకి తట్టిన ఆలోచన కలెక్టర్ను కదిలించింది. వారి కృషి ఫలించింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరియళూరు జిల్లాలో ఓ ప్రాంతంలో స్కూల్కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అటు నుంచి బడికెళ్లే విద్యార్థుల ముందే అక్కడ కొంతమంది మద్యం సేవించేవారు. తాగిన తర్వాత ఇష్టారీతిన వ్యవహరించేవారు. అభ్యంతరకర పదజాలం వాడుతూ దూషించుకునేవారు. ఈ పరిస్థితిని చూసి విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యేవారు. కొంతమందైతే ఏకంగా స్కూల్కి రావడమే మానేశారు. దీన్ని గమనించిన ఇళంథెండ్రాల్(6వ తరగతి), అరివరాసన్(4వ తరగతి) అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లు కలెక్టర్కు లేఖ రాశారు. నవంబరులో ప్రత్యక్ష తరగతుల జరగనున్న నేపథ్యంలో అక్కడి నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రమణ సరస్వతి.. అక్కడి నుంచి ఆ షాప్ను వేరే ప్రాంతానికి మార్పించారు.
2015లో మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండొద్దు. అయితే, తాజాగా విద్యార్థులు ఫిర్యాదు చేసిన దుకాణం వంద మీటర్ల లోపు లేకపోయినప్పటికీ.. కలెక్టర్ దానిపై చర్యలు తీసుకోవడం విశేషం. స్కూల్ తరఫున పిల్లలు ప్రాతినిధ్యం వహిస్తూ చేసిన విజ్ఞప్తి మేరకే స్పందించామని వెల్లడించారు. మరోవైపు పిల్లలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సమాజాన్ని మారుస్తున్న నిజమైన నాయకులంటూ సామాజిక మాధ్యమాల్లో కీర్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM