పనస పొడితో మధుమేహానికి చెక్!
మధుమేహంతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తూ భారతీయ వైద్యుల బృందం చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పనస కాయలో మధుమేహాన్ని ......
ఇంటర్నెట్ డెస్క్: మధుమేహంతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తూ భారతీయ వైద్యుల బృందం చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పనస కాయలో మధుమేహాన్ని అదుపు చేసే గుణాలున్నాయని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. దీంట్లో ఫైబర్, మినరల్స్, యాంటీ డయాబెటిక్ పదార్థాలు ఉండటంతో దాని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు ప్రయోజం ఉంటుందేమోన్న భావనతో పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా 2019 మే నెలలో 40 మందిపై ఏడాది పాటు పరిశోధన నిర్వహించారు. ఆస్పత్రిలో ఏడాది కాలంగా మధుమేహ వ్యాధి నియంత్రణ కోసం మాత్రలు వినియోగిస్తున్న వారికి గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ హెచ్ బీఏ1సి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 6 పాయింట్లు వచ్చిన వారికి చక్కెర ఉండదు. కాగా 6 దాటి 8 పాయింట్లు వచ్చిన 40 మందిని గుర్తించి వాళ్లకు పనస పొడితో పాటు, ఇతర మందులు, ప్లాసిబో వీట్ ఫ్లోర్ను ఇచ్చారు. తర్వాత మూడు నెలలు నిశితంగా పరిశీలించారు. చివరిగా ఫలితాన్ని పరిశీలించినప్పుడు టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ప్లాస్మా గ్లూకోజ్ స్థాయి బాగా తగ్గింది. మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకూ ఎంపిక చేసిన 18 నుంచి 60 ఏళ్ళ వయసు వారికి పనసపొడిని ఇవ్వగా, వాళ్లలో చక్కెర వ్యాధి అదుపులోకి వచ్చింది. దీంతో పనస పొడి మధుమేహాన్ని అదుపు చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తోందని పరిశోధకులు నిర్ధారించారు. అందుబాటులో ఉండే పనసకాయ పొడిని ప్రతిరోజూ భోజనంలో ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే మధుమేహ వ్యాధి అదుపులోకి వస్తుందని పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. పరిశోధకులు ఈ పరిశోధనకు సంబధించిన పత్రాన్ని నేచర్ జర్నల్కు సమర్పించారు. పరిశోధన పత్రాన్ని పరిశీలించిన నేచర్ జర్నల్ దీనిపై వ్యాసాన్ని కూడా ప్రచురించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే