Ts News: నోటిఫికేషన్ తప్పుదోవ పట్టించేలా ఉంది.. పుప్పాలగూడ ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే
రాజేంద్రనగర్ పరిధిలోని పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలం నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పుప్పాలగూడలోని 301, 302, 303 సర్వే నంబర్లలోని
హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలోని పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలం నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పుప్పాలగూడలోని 301, 302, 303 సర్వే నంబర్లలోని ప్లాట్లను ఈనెల 28న వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేలానికి సంబంధించి గతనెల 30న టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే సర్వే నంబరు 301లోని భూమిని వేలం వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లక్ష్మీ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. కాందిశీకుల నుంచి తాము కొనుగోలు చేసిన భూములు 301 సర్వే నంబరులో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్ల భూమలు వేలం వేయడం లేదంటూనే నోటిఫికేషన్లో 301 సర్వే నంబరును ప్రస్తావించారని తెలిపింది. నోటిఫికేషన్ తప్పుదోవ పట్టించేలా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. సర్వే నంబరు 301లోని 25, 26, 28, 29, 30 ప్లాట్ల వేలంపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏలకు నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక