రైల్వేమన్.. నీ సాహసానికి సలాం..
ఒక్క సెకను ఆలస్యమైతే ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. కానీ ఓ రైల్వేమన్ బాలుడిని ఆపద్బాంధవుడిలా కాపాడాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్: ఒక్క సెకను ఆలస్యమైతే ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. కానీ ఓ రైల్వేమన్ బాలుడిని ఆపద్బాంధవుడిలా కాపాడాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. నిర్మానుష్యంగా ఉన్న ముంబయిలోని వెంగని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్పై ఓ బాలుడు, బాలిక నడుచుకుంటూ వెళుతున్నారు. అంతలోనే ఆ బాలుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అప్పటికే ఆ పట్టాలపై ఓ రైలు వేగంగా వస్తూ ఉంది. దీంతో ఆ బాలిక గట్టిగా అరుస్తూ బాలుడిని పైకి రావాలంటూ కోరుతోంది. ఇది గమనించిన మయూర్ షెల్కే అనే రైల్వేమన్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. పట్టాలపై నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా బాలుడిని ప్లాట్ఫామ్ ఎక్కించి, వెంటనే అతడు కూడా పైకెక్కాడు. సెకను ఆలస్యమైతే ఆ బాలుడిని రైలు ఢీ కొట్టేదే. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మయూర్ షెల్కే అంటే గర్వంగా ఉందని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..