ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్!
కొవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్లో ఈ టీకా తీసుకున్న ఓ వాలంటీర్లో అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం.............
న్యూయార్క్: కొవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బ్రిటన్లో ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తుది దశకు చేరుకున్న క్లినికల్ ట్రయల్స్ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ ప్రకారం వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వాలంటీర్కు తలెత్తిన అనారోగ్య సమస్యలేంటో మాత్రం వెల్లడించలేదు.
అయితే, వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణ విషయమేనని ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి తెలిపారు. ఇలా జరిగినప్పుడు మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి.. తిరిగి ప్రయోగాల్ని కొనసాగిస్తుంటామన్నారు. ఇది సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. ట్రయల్స్లో ఎలాంటి లోపాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. ఇంత భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పుడు ఒకరిద్దరిలో దుష్ప్రభావాలు తలెత్తడం సాధారణంగా జరగుతుంటుందన్నారు. తాజాగా తలెత్తిన సమస్యపై వీలైనంత త్వరగా సమీక్ష నిర్వహించి వ్యాక్సిన్ ప్రయోగాల్ని పునఃప్రారంభిస్తామన్నారు.
దీనిపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు స్పందించారు. జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలు కాకుండా ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డెబోరా ఫుల్లర్ అనే ప్రముఖ పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. ఈయన కూడా మరో పద్ధతిలో కొవిడ్ వ్యాక్సిన్పై ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే, దీనిపై పెద్దగా విచారించాల్సిన అవసరం ఏం లేదన్నారు. అసలు టీకా తీసుకున్న వారి శరీరం ఎలా స్పందిస్తోంది.. వారి ఆరోగ్యం ఎలా ఉంటోంది.. వంటి అంశాలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇలా తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.
కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మరో పరిశోధకుడు ఏంజిలా రస్ముస్సేన్ స్పందిస్తూ.. వ్యాక్సిన్ వల్ల తలెత్తిన అనారోగ్యం అయి ఉండదని అంచనా వేశారు. ఏదేమైనా ఇలాంటి సమస్యల్ని ముందుగా గుర్తించడానికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారని తెలిపారు. చివరి దశలో భాగంగా భారీ సంఖ్యలో వాలంటీర్లకు టీకా అందజేస్తారు. తద్వారా ప్రాథమిక దశల్లో పాల్గొన్న వారిలో కనిపించని దుష్ప్రభావాలేమైనా తలెత్తుతాయేమో పరిశీలిస్తారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా అమెరికాలో 30 వేల మంది వాలంటీర్లను ప్రయోగాల కోసం తీసుకుంది. వీరిలో దాదాపు మూడు వంతుల మందికి వ్యాక్సి్న్ అందజేసినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో టీకాను ప్రయోగించడం వల్ల ఫలితాలు మరింత కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్తో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు చేరుకున్నాయి. వీటిలో మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీ, భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా వ్యాక్సిన్ను ప్రజలకు అందజేసేందుకు కృషి చేయాలని పలు సంస్థలు ఏకగ్రీవంగా తీర్మానించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!