వ్యాక్సిన్పై ఆశలు పెంచుతున్న ఫైజర్ ప్రకటన!
కరోనా వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా ప్రజావినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ ఆసక్తికర ప్రకటన చేసింది..........
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా ప్రజావినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి నాటికి తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సామర్థ్యం తెలిసిపోతుందని తెలిపింది. కరోనాను అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని నిర్ధారణ అయిన వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతులకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసుకుంటామని స్పష్టం చేసింది.
23000 మంది వాలంటీర్లపై ప్రయోగాలు..
జర్మనీకి చెందిన బయోఎన్టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. తొలి రెండు దశల్లో ఆశాజనక ఫలితాలివ్వడంతో ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మూడో దశలో 23,000 మంది వాలంటీర్లు ప్రయోగాలకు ముందుకు వచ్చారని సంస్థ సీఈవో ఆల్బర్ట్ బోర్లా తెలిపారు. వీరిలో చాలా మందికి రెండో డోసు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అక్టోబర్ చివరి నాటికి వ్యాక్సిన్ సామర్థ్యం ఏంటో తేలిపోయే అవకాశం ఉందన్నారు. టీకా సమర్థంగా పనిచేస్తుందని తేలిన వెంటనే అత్యవసర అనుమతుల కింద ప్రజావినియోగానికి అందుబాటులోకి తెచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటామన్నారు.
మూడో దశ ముగియకున్నా..
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో ముగియనప్పటికీ.. ప్రాథమిక ఫలితాలను బట్టి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేస్తామని ఎఫ్డీఏ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంటామని ప్రకటించిన తొలి సంస్థ ఫైజరే కావడం విశేషం. సంస్థ తాజా ప్రకటనతో వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి.
ఆశలు రేకెత్తిస్తున్న ప్రకటనలు..
నవంబరు 1 నాటికి వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలంటూ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్.. అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయం కంటే ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను బట్టి రిస్క్తో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వొచ్చని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
వివిధ దశల్లో వ్యాక్సిన్లు..
ఫైజర్ తాజా ప్రకటనతో ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుడుతున్నారు. మోడెర్నా సహా ఆక్స్ఫర్డ్తో కలిసి ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న వ్యాక్సిన్లు కూడా మూడో దశలో ఉన్నాయి. దాదాపు ఫైజర్ వ్యాక్సిన్ ఉన్న దశలోనే అవి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 175 రకాల కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా.. వీటిలో 34 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. వీటిలో ఎనిమిది మూడోదశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇక భారత్లో మొత్తం 8 రకాల కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి జరుగుతుండగా.. వీటిలో రెండు రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు చేరుకున్నాయి.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్