అమెరికాలోనూ కొత్తరకం వైరస్!
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ తన ఉనికిని విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు...........
ఇటీవల ఎటూ ప్రయాణించని వ్యక్తిలో గుర్తింపు
వాషింగ్టన్: యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు. డెన్వర్కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఇటీవల అతను ఎక్కడికి ప్రయాణించిందీ లేదని అధికారులు తెలిపారు. దీన్ని అమెరికా ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ పరిగణనలోకి తీసుకుంది. వైరస్ సోకిన వ్యక్తితో ఇటీవల కలిసిన వారిని వెతికే పనిలో పడింది. ఇప్పటికే పాతరకం కరోనాతో అమెరికా అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త రకం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ కొత్త వైరస్ గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉందని జేర్డ్ పొలిస్ తెలిపారు. వేగంగా వ్యాపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారని గుర్తుచేశారు. కొలరాడో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన అమెరికా.. యూకే నుంచి అమెరికాకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం చూపాల్సిందేనని షరతు విధించిన విషయం తెలిసిందే.
జన్యు పరివర్తన చెందిన కొత్త కరోనా వైరస్ కేసులు భారత్లోనూ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాల వర్గాలు ప్రకటించాయి. అయితే కొత్త వైరస్ సోకిన వారిలో ఆరుగుర్ని మాత్రమే గుర్తించినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మిగిలిన వారు ఎవరు? ఎక్కడి వారనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు యూకే నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశముందని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ మంగళవారం వెల్లడించారు.
ఇవీ చదవండి...
భారత్-బ్రిటన్ మధ్య రాకపోకలు మరికొంత కాలం బంద్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.