కోపంతో పిల్లాడిని చితకబాదిన రిటైర్డ్‌ పోలీస్‌

తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో రిటైర్డ్‌ పోలీసు ఓ పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టిన ఘటన హరియాణాలో జరిగింది.

Updated : 02 Jun 2021 05:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో రిటైర్డ్‌ పోలీసు ఓ పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టిన ఘటన హరియాణాలో జరిగింది. గురుగ్రామ్‌లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా వారి స్నేహితుల్లో ఒకరి కంటికి గాయమైంది. తన కుమారుడిని గాయపరిచాడనే కోపంతో విశ్రాంత పోలీస్, అతడి కుటుంబ సభ్యులు ఓ బాలుడ్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా చావబాదారు. వదిలేయమని బాలుడి సోదరి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 39లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని