AstraZeneca: కరోనాపై కొత్త ఆయుధం సిద్ధం..!
కొవిడ్పై పోరుకు మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టీకాలు, రీపర్పస్ ఔషధాలు అందుబాటులో ఉండగా.. రీజనరాన్ సంస్థ యాంటీబాడీ కాక్టెయిల్ను అందుబాటులోకి తెచ్చింది.
ఆశలు రేపుతున్న ఆస్ట్రాజెనెకా కాంబో..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కొవిడ్పై పోరుకు మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టీకాలు, రీపర్పస్ ఔషధాలు వినియోగంలో ఉండగా.. రీజనరాన్ సంస్థ యాంటీబాడీ కాక్టెయిల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రభావవంతంగా ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. తాజాగా మరో యాంటీబాడీ కాక్టెయిల్ కూడా అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే దీనికి సంబంధించి చేపట్టిన ప్రయోగాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.
ఏమిటీ ఔషధం..?
ఏజెడ్డీ7442 (AZD7442) పేరుతో లాంగ్యాక్టింగ్ యాంటీబాడీలు (LAAB)ల మిశ్రమాన్ని ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. కేవలం ఒక్క డోసుతోనే ఇది సానుకూల ఫలితాలను ఇస్తోందని పేర్కొంది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా - ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి కొవిషీల్డ్ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ను ఎదుర్కొనే కొన్ని రకాల యాంటీబాడీలకు సంబంధించి ఆస్ట్రాజెనెకా సంస్థ గతేడాది జూన్లో వాండర్బిల్ట్ యూనివర్శిటీ నుంచి హక్కులను కొనుగోలు చేసింది. వీటిల్లోని రెండు యాంటీబాడీల సమ్మేళనాన్ని ఏజెడ్డీ7442 పేరుతో అభివృద్ధి చేసి క్లినికల్ పరీక్షలు నిర్వహించింది. ఈ సమ్మేళనంలో ‘టిక్సాగేవిమాబ్’, ‘సిలగావిమాబ్’ అనే యాంటీబాడీలను వినియోగించింది. ప్రత్యేకమైన సాంకేతికతను వాడి ఆస్ట్రాజెనెకా వీటిని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దింది. ఫలితంగా ఇవి సార్స్ కొవ్-2 వైరస్ స్పైక్ ప్రొటీన్లోని కీలక భాగాలను అంటిపెట్టుకొంటాయి. దీనికి తోడు సాధారణ యాంటీబాడీల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ సమయం సచేతనంగా ఉంటాయి.
ప్రయోగ ఫలితాలు ఇలా..
ఆస్ట్రాజెనెకా దీనిపై రెండు విధాలుగా ప్రయోగాలు చేపట్టింది. కొవిడ్ రాకుండా ఎంతవరకు అడ్డుకొంటుంది..? కొవిడ్ సోకిన ఔట్ పేషెంట్ చికిత్సలో ఎంత సమర్థంగా ఉపయోగపడుతుందన్న అంశాలపై మూడోదశ ప్రయోగ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.
కొవిడ్ సోకకుండా ఎంతమేరకు అడ్డుకొంటుందనేది తెలుసుకొనే ప్రయోగాల్లో 300 ఎంజీ డోస్ను, ప్లాసిబో(డమ్మీ ఔషధం) వలంటీర్లకు ఇచ్చారు. అమెరికా, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియంలో 87 ప్రదేశాల్లో 5,197 మందిపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఈ డోసు తీసుకొన్న వారిలో లక్షణాలతో కూడిన కొవిడ్ సోకే ముప్పు 83శాతం తగ్గిపోయింది.
ఇక కొవిడ్ చికిత్సకు వినియోగించడంపై చేసిన ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో 75శాతం ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు (కోమార్బిడిటీస్) ఉన్నాయి. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మొత్తం 903 మంది ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఏజెడ్డీ7442ని 600ఎంజీ చొప్పున వలంటీర్లకు ఇచ్చారు. దీంతో ప్లాసిబోతో పోలిస్తే ఔషధం తీసుకొన్న వారిలో 88 శాతం తీవ్రమైన కొవిడ్ లక్షణాలు రాలేదు. అంతేకాదు, మరణాలు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో ప్లాసిబో తీసుకొన్నవారిలో ఐదుగురికి తీవ్రమైన లక్షణాలు వచ్చాయి.. ఇద్దరు మరణించారు. ఏజెడ్డీ7442 వల్ల దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉన్నాయని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.
ఆస్ట్రాజెనెకా నిపుణులు ఏమంటున్నారు..?
ఈ ప్రయోగ ఫలితాలను ఆస్ట్రాజెనికా నిపుణులు వర్చువల్ మీటింగ్లో ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో కనీసం 2శాతం మందికి టీకాల నుంచి తగినంత భద్రత అందకపోవచ్చని తెలిపారు. బ్లడ్ క్యాన్సర్, ఇతర క్యానర్లకు చికిత్స పొందుతున్న వారు, డయాలసిస్ చేయించుకొనేవారు, అవయవ మార్పిడి జరిగిన వారు, వ్యాధి నిరోధక శక్తి మందగించే ఔషధాలు వినియోగించేవారు ప్రమాదం అంచున ఉన్నారన్నారు. ఈ కొత్త ఔషధం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM