Covid Cases: ఆరు కేసులు.. ఆంక్షల గుప్పిట్లో బీజింగ్!
కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం మొదటినుంచి కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప సంఖ్యలో కేసులు బయటపడినా.. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. తాజాగా రాజధాని నగరం బీజింగ్లో ఆయా...
బీజింగ్: కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం మొదటినుంచి కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప సంఖ్యలో కేసులు బయటపడినా.. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. తాజాగా రాజధాని నగరం బీజింగ్లో ఆయా కాన్ఫరెన్స్లకు హాజరైన వ్యక్తులతోసహా మొత్తం ఆరుగురికి పాజిటివ్గా తేలడంతో.. మొత్తం నగరవ్యాప్తంగా సమావేశాలు, ఈవెంట్లపై ఆంక్షలు విధించింది. ఇక్కడి చాయాంగ్, హైడియన్ ప్రాంతాల్లో గురువారం ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో సంబంధిత పాజిటివ్ రోగులతో క్లోజ్గా కాంటాక్ట్ అయిన 280 మందితోపాటు రెండు చోట్ల దాదాపు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యవహారం చాలామందితో ముడిపడి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చాలా కష్టమని నగర ప్రభుత్వ ప్రతినిధి జు హెజియాన్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా కట్టడి అవసరమని తెలిపారు.
డోంగ్చెంగ్లో మాల్ మూసివేత..
మరోవైపు కొంతమంది ఉద్యోగులకు పాజిటివ్గా తేలడంతో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్(సీఎన్పీసీ) సైతం బీజింగ్లోని తన కార్యాలయ భవనాన్ని మూసివేసింది. దీంతోపాటు కొవిడ్ సోకిన వ్యక్తితో కలిసి తిరిగిన ఒకరు వచ్చినట్లు తేలడంతో.. డోంగ్చెంగ్లోని రాఫెల్స్ సిటీ మాల్ను మూసివేశారు. లోపల ఉన్న సిబ్బంది, వినియోగదారులను పరీక్షించాకే బయటకు పంపించారు. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు బీజింగ్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాన్ఫరెన్స్లను ఆన్లైన్ వేదికల ద్వారానే నిర్వహించాలని, ఆఫ్లైన్ ఈవెంట్లకు తక్కువమందిని అనుమతించాలని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వైస్ డైరెక్టర్ పాంగ్ జింగ్హువో పేర్కొన్నారు. హాజరైన వారినీ క్లోజ్డ్ లూప్లో ఉంచాలని, ప్రజారవాణా వినియోగించుకోకుండా కట్టడి చేయాలని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతల ఉన్నతస్థాయి సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో బీజింగ్లో ఒక్కసారిగా కేసుల కలవరం మొదలుకావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్