CBSE: కొవిడ్తో అనాథలైన విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు: సీబీఎస్ఈ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్ష, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చింది.
దిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్ష, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చింది. విద్యార్థులపై కొవిడ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయకూడదని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ ఆదేశించారు. 10, 12వ తరగతి పరీక్షల కోసం విద్యార్థుల జాబితాను సమర్పించే సమయంలో పాఠశాలలు ఆయా వివరాలను ధ్రువీకరించి నమోదు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!