China: డ్రాగన్ కుయుక్తులు.. సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు!
భారత్కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్ వెంబడి రహదారులు సహా భారీ సైనిక నిర్మాణాలు చేపడుతూ భారత్ను చైనా పదే పదే కవ్వింపులకు గురిచేస్తోంది. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎదుర్కొనేందుకు రెట్టింపు సన్నద్ధతతో ఉన్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ ఘటనతో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. అయితే ఇరు దేశాల సైన్యాధికారుల చర్చలతో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదు. భారత్తో వివాదాల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు చైనా సైనిక నిర్మాణాలు చేపట్టడం.. భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ సమయాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దులకు చేరవేసేందుకు వీలుగా తూర్పు లద్దాఖ్లో పెద్ద ఎత్తున సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. తూర్పు లద్దాఖ్కు ఆవల ఉన్న తమ భూభాగంలో చైనా రహదారులను నిర్మిస్తోంది. వాటిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడం ద్వారా యుద్ధ సమయాల్లో వేగంగా ఆయుధాలు, సైన్యాన్ని తరలించేందుకు వీలవుతుందని చైనా భావిస్తోంది. క్షిపణి రెజిమెంట్లను వేగంగా చేర్చేందుకు ఈ నిర్మాణాలను డ్రాగన్ చేపట్టినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కష్గర్, గర్గున్సా, హోటన్ సైనిక స్థావరాల వద్ద రహదారులను విస్తరించడంతోపాటు.. అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ను సైతం నిర్మిస్తున్నట్టు పేర్కొన్నాయి.
గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత సన్నద్ధతతో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ సిద్ధమైంది. అతి శీతల ప్రాంతాల్లో షెల్టర్లను నిర్మించడంతోపాటు.. రోడ్లను నిర్మించడం ద్వారా ఆ ప్రదేశాలను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగాన్ని చైనా గణనీయంగా పెంచినట్టు భారత సైన్యం తెలిపింది. ఎక్కువ విస్తీర్ణంలో నిఘా కోసం డ్రోన్లను మోహరించినట్టు చెప్పింది. భారత సరిహద్దులకు చైనా భారీగా బలగాలను తరలించినట్టు వివరించింది.
సరిహద్దుల్లో చైనా ఎన్ని కుయుక్తులకు పాల్పడినా.. ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. గతేడాది కంటే మెరుగైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు సైన్యం వెల్లడించింది. డ్రాగన్కు తగిన రీతిలో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేసింది. పాక్ సరిహద్దుల వెంబడి సైతం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో అతిశీతల పరిస్థితులు ఎదుర్కోనున్న నేపథ్యంలో బలగాలను మరింత బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు