Bypolls: మండీలో కాంగ్రెస్.. దాద్రానగర్లో శివసేన.. మధ్యప్రదేశ్లో భాజపా
దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. హిమాచల్ప్రదేశ్లోని మండీ, మధ్యప్రదేశ్లోని ఖాంద్వా,
3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
దిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. హిమాచల్ప్రదేశ్లోని మండీ, మధ్యప్రదేశ్లోని ఖాంద్వా, దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీటితో పాటు తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బద్వేలు సహా 13 రాష్ట్రాల్లోని 29 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. నేడు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది.
ఈ 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో భాజపా 6, కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొందగా.. మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి. ఇక మండీ, ఖాంద్వా, దాద్రానగర్ హవేలీలో సిట్టింగ్ ఎంపీల మరణంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మండీలో కాంగ్రెస్.. దాద్రానగర్లో శివసేన
* మండీలో కాంగ్రెస్ తరఫున వీరభద్ర సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేయగా.. భాజపా నుంచి కార్గిల్ వీరుడు బ్రిగేడియర్ కుషాల్ సింగ్ బరిలోకి దిగారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ప్రతిభా సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
* దాద్రా నగర్ హవేలీలో ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో మోహన్ సతీమణి కలాబెన్ దేల్కర్ శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మహేశ్ దోదీ, భాజపా నుంచి మహేశ్ గవిత్ బరిలోకి దిగారు. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. శివసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* మధ్యప్రదేశ్లోని ఖాంద్వా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ తర్వాత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాజనారాయణ్ సింగ్ పూర్ణిపై 2వేల ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు.
* పశ్చిమ బెంగాల్లో నాలుగు శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా.. నాలుగింట అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
* అస్సాంలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. ఒక చోట కాంగ్రెస్, మరో స్థానంలో యూపీపీఎల్ ముందంజలో ఉన్నాయి.
* మధ్యప్రదేశ్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు