Corona Virus: జర్మనీలో మళ్లీ కరోనా కల్లోలం.. కొత్త కేసుల ఆల్టైం రికార్డు!
జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి గతంలో ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.......
బెర్లిన్: జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి గతంలో ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలోనే జర్మనీలో 33,949 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 18న అత్యధికంగా 33,777 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయాయి. ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ 16 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశమయ్యారు. చలికాలంలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఆస్పత్రుల్లో ఐసీయూలు నిండిపోవడం మళ్లీ ప్రారంభం కావడం, పిల్లల్లో ఇన్ఫెక్షన్లు పెరిగిపోతుండటం వంటి కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు, గురువారం ఒక్కరోజే 165 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో ఇప్పటివరకు 46.62లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 96 వేల మందికి పైగా మృతిచెందారు. 43.28లక్షల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2.3లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి.
జర్మనీలో ఇంకా టీకాలు వేసుకోని వారంతా తీసుకోవాలని సీనియర్ వైద్య అధికారులు అక్కడి పౌరులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. జర్మనీలో 83 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ తొలి రౌండ్ పూర్తయింది. దాదాపు 16.2 మిలియన్ల జనాభాకు (12 ఏళ్లు పైబడిన వారందరికీ) ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కావాల్సి ఉంది. వీరిలో 3.2మిలియన్ల మంది 60ఏళ్లు పైబడినవారే ఉండటం గమనార్హం. మరోవైపు, దేశంలో బూస్టర్ డోసు అందుబాటులోకి తేవాలని ఆగస్టులోనే అధికారులు అంగీకరించారు. అయితే, 60 ఏళ్లు పైబడినవారికి, నర్సింగ్ హోమ్ రెసిడెంట్స్, సిబ్బందికి బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 2 మిలియన్ల మందికి మాత్రమే పూర్తి చేశారు.
ఇటీవల కొన్ని సీనియర్ సిటిజన్ హోమ్లలో కొవిడ్ వ్యాప్తి పెరగడం, డజన్ల మంది చనిపోవడంతో నర్సింగ్ హోమ్లలో కొవిడ్ పరీక్షలు చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని కుటుంబ వైద్యుల అసోసియేషన్ చీఫ్ ఉల్రిచ్ వెగెల్డ్ డిమాండ్ చేశారు. టీకా తీసుకోని వ్యక్తులెవరూ కొవిడ్ బారిన పడే అవకాశం ఉండే వ్యక్తులను కలవరాదన్నారు. ఇది సీనియర్ సిటిజన్ హోమ్లు, నర్సింగ్ హోమ్లో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు కూడా వర్తింపజేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్