కొన్ని చోట్ల గాలి ద్వారానూ కరోనా!
కొన్ని చోట్ల కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది.
వెల్లడిస్తూ.. సూచనలు చేసిన ‘ది లాన్సెట్’ జర్నల్
వాషింగ్టన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న నివేదికలు ఆందోళనకు గురిచేశాయి. వీటిని నిర్ధారించేందుకు బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. చివరకు గాలి ద్వారానూ వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చే పది విషయాలను నివేదించింది.
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు..
కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్ సోకిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టంచేశారు. గాలిద్వారా వైరస్ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.
లక్షణాలు లేని వారినుంచీ..!
బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్ ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అసింప్టమెటిక్(లక్షణాలు లేని)వ్యక్తుల నుంచి కరోనా వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాలిలో వైరస్ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.
అయితే, తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువుల నుంచి వైరస్ తేలికగా గాలిలో ఎలా ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్స్ ఆఫ్ ఫ్లుయిడ్ ఫ్లోస్, బ్రతికున్న వైరస్ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణడు గ్రీన్హాల్గ్ పేర్కొన్నారు. వీటిలో కొన్ని గాలిలో వ్యాప్తిని బలహీనమైనవిగా అంచనా వేసినప్పటికీ.. ఇది సాధ్యమనడానికి బలమైన ఆధారాలెన్నో ఉన్నాయని స్పష్టంచేశారు.
అప్రమత్తం కావాల్సిందే..
గాలిలో వైరస్ వ్యాపించడం తీవ్రమైనదని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస (ఉచ్ఛ్వాసము) వల్ల వైరస్ గాలిలోకి వెళ్లడం.. తద్వారా ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు వైరస్ వారికి సోకుతుంది. ఇదే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లోనూ రుజువైందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కింబర్లీ ప్రాథర్ స్పష్టం చేశారు. గాలి ద్వారానూ కరోనా వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ దిగువ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పరిశోధకులు పేర్కొన్నారు.
* గాలిలో వైరస్ వ్యాప్తి చెందకుండా సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.
* ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా చూసుకోవాలి.
* ఇండోర్ ప్రాంతాల్లో తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి.
* ఇండోర్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలి.
* సాధారణ సమయాల్లోనూ నాణ్యమైన మాస్కులు వాడాలి.
* కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాలి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు నూతన మార్గదర్శకాల ద్వారా వైరస్ కట్టడికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అధ్యయన బృందం సూచించింది. ఇక, గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఇదివరకే వెల్లడించింది. వీటిపై భారత్లో పరిశోధన చేస్తోన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) కూడా ఇండోర్ ప్రాంతాల్లో గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం