Omicron: బూస్టర్ డోసులపై అయోమయం.. టీకా నిపుణుల భిన్నాభిప్రాయాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. నెమ్మదిగా ప్రపంచదేశాలకు పాకుతోంది. భారత్లోనూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ వైరస్ను ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకోగలవా? లేదా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కొవిడ్ వ్యాక్సిన్లతోపాటు బూస్టర్ డోసు కూడా
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. నెమ్మదిగా ప్రపంచదేశాలకు పాకుతోంది. భారత్లోనూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ వైరస్ను ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకోగలవా? లేదా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కొవిడ్ వ్యాక్సిన్లతోపాటు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని పలువురు టీకా, వైద్యశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడకుండా ఎంత వీలైతే అంత తొందరగా బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ను కట్టడి చేయొచ్చని అంటున్నారు. మరోవైపు బూస్టర్ డోసులపై పులువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు బూస్టర్ డోసులు అత్యవసరమని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఒమిక్రాన్.. భవిష్యత్తులో వచ్చే ఇతర వేరియంట్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని మాయో క్లినిక్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్ గ్రెగోరీ పోలాండ్ తెలిపారు. ‘బూస్టర్ డోసు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.. కానీ, కొత్త వేరియంట్ను అడ్డుకునేందుకు కొవిడ్ నిబంధనలతోపాటు బూస్టర్ డోస్ తీసుకోవడం ఒక్కటే మార్గం’ అని ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సిస్ సెంటర్కు చెందిన డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ వ్యాక్సిన్ లూయిస్ ప్రివొర్-డమ్ చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత గురించి పూర్తిగా తెలియదు కాబట్టి.. ఎలాంటి రక్షణ లేకుండా ఉండటం కంటే.. బూస్టర్ డోస్ తీసుకొని కొంతమేర రక్షణ పొందడం ఉత్తమమని లూయిస్ అభిప్రాయపడ్డారు.
‘వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు వైరస్పై పోరాటం చేసేలా శరీరంలో యాంటీ బాడీలను, టి-కణాలను ప్రేరేపిస్తాయి. ఈ యాంటీబాడీలు ఒమిక్రాన్ వైరస్ను బంధించడంలో బలహీనంగా ఉన్నా.. ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించగలవు’’అని యేలే స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఇమ్యూనోబయాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తోన్న అకికో ఇవసాకి వెల్లడించారు. ఒకవేళ ఒమిక్రాన్ను నియంత్రించడానికి కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. బూస్టర్ డోసును నిలిపివేయవద్దని, కొత్త బూస్టర్ డోసులను తయారు చేయాలని యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడిసిన్లో హాస్పిటల్ ఎపిడర్మటాలజిస్ట్ చీఫ్ ఎమిలీ లండన్ సూచించారు.
బూస్టర్ డోసుపై పలువురు నిపుణుల అభ్యంతరం
మెజార్టీ నిపుణులు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తుంటే.. మరికొందరు వైద్య నిపుణులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారిలో శాన్ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్ అండ్ ఇన్ఫెక్షిసియస్ డీసీజెస్ ప్రొఫెసర్గా ఉన్న మోనికా గాంధీ కూడా ఉన్నారు. ‘‘బూస్టర్ డోసులు 65 ఏళ్లు ఆ పైబడిన వయస్కుల వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే ఒమిక్రాన్ వైరస్ గురించి ఎవరికీ పూర్తి అవగాహన రాలేదు. అలాంటప్పుడు అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించడం సరికాదు. యువతపై బూస్టర్ డోసు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’’అని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని పిల్లల ఆస్పత్రిలో ఉన్న వ్యాక్సిన్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ పాల్ ఓఫిట్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లు లేదా బూస్టర్ డోసులు తీసుకునే యువతలో మయోకార్డిటిస్(హృదయ కండరాల వాపు) వచ్చే అవకాశముందని హెచ్చరించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి ‘సూర్యతిలకం’.. కనులవిందుగా అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. -
నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్ ఖాన్
ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. -
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది
లోక్సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. -
అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. -
న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం
న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి
ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు. -
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుర్జేవాలాపై ఈసీ చర్యలు
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలాపై 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (Election Commission) నిషేధం విధించింది. -
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు
ఇంటర్వ్యూ సమయంలో తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి.. సివిల్స్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. అతడే ఒడిశాకు చెందిన అనిమేశ్ ప్రధాన్ (24).
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
-
అయోధ్య రాముడికి ‘సూర్యతిలకం’.. కనులవిందుగా అద్భుత దృశ్యం
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్