టీకా తీసుకుంటే..94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!
65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది
అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణంబారిన పడే ప్రమాదం నుంచి గట్టెక్కినట్లేనని పేర్కొంది.
అమెరికాలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రన నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్ తీసుకున్న మరో 187గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో (రెండు డోసులు) వ్యాక్సిన్ తీసుకున్న వారు కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతోన్న ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు తేలడం మనతోపాటు ఆసుపత్రులకు ఊరట కలిగించే విషయమని సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్స్కై పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా ఆసుపత్రుల్లో చేరాల్సినంత ప్రమాదం లేదనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. అందుకే కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రయత్నాలకు విస్తరిస్తూనే ఉంటామన్నారు. తద్వారా ఆసుపత్రి సిబ్బంది, పడకలు, ఇతర సదుపాయాలను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంచవచ్చని సీడీసీ చీఫ్ వాలెన్స్కై పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, బ్రిటన్ నివేదికల్లోనూ ఇవే ఫలితాలు..
కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపే వాస్తవ ఫలితాల నివేదికలను ఈమధ్యే ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో 60శాతానికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఇజ్రాయెల్.. వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాలు జరుపుతోంది. ఇందులో భాగంగా వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో గుర్తించింది. అయితే, ప్రస్తుతం అక్కడ కేవలం ఫైజర్ టీకాను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇక బ్రిటన్లో జరిపిన అధ్యయనంలోనూ కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా దాదాపు 50శాతం రక్షణ కలుగుతుందని తేలింది. ముఖ్యంగా ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో పంపిణీ చేస్తోన్న ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వృద్ధులను రక్షించుకున్నట్లే..!
కరోనా వైరస్ మహమ్మారి వృద్ధుల్లోనే అత్యంత తీవ్రత చూపిస్తున్న విషయం తెలిసిందే. 65ఏళ్ల తక్కువ వయసువారితో పోలిస్తే వృద్ధుల్లోనే 6 నుంచి 8శాతం కొవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ అలబామా నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోత్పోతున్న వారిలో ఎక్కవ మంది 65ఏళ్లు పైబడినవారే ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా అమెరికాలో ఇప్పటివరకు 65ఏళ్ల వయసుపైడిన వారిలో 65శాతం(3.7కోట్ల) మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. అమెరికానే కాకుండా భారత్తోపాటు ఇతర దేశాల్లో టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం వృద్ధులకే ఇస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం