వ్యాక్సిన్ వస్తే మరి ఖరీదెంతో?
కరోనా వైరస్ కోరలు పీకే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలపైనే.....
లండన్: కరోనా వైరస్ కోరలు పీకే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలపైనే యావత్తు ప్రపంచం దృష్టి సారించింది. అయితే, ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ధరపరంగా అది ఎంతమందికి అందుబాటులో ఉంటుందన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్ కీలక విషయాలు పంచుకున్నారు.
వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందజేయాలన్న లక్ష్యంతోనే పరిశోధనలు సాగుతున్నాయని హిల్ తెలిపారు. ప్రయోగాలు ఫలవంతమైతే.. ధరని నియంత్రించే విధంగా డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తక్కువ ధర, ఎక్కువ మందికి చేర్చేందుకు సౌకర్యంగా ఉండడమే లక్ష్యంగా పరిశోధనని సాగిస్తున్నామని తెలిపారు. ‘‘ఈ వ్యాక్సిన్ ఖరీదు తక్కువే ఉంటుంది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. గ్లోబల్ సప్లై చైన్కి అందుబాటులో ఉంటుంది. దీంతో వివిధ ప్రదేశాల్లో దీన్ని తయారు చేస్తారు. మొదట్నుంటి మా ప్రణాళిక ఇదే’’ అని హిల్స్ వివరించారు. ఇప్పటికే 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని.. సెప్టెంబరు నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు.
‘ChAdOx1 nCoV-19’ పేరిట ఆక్స్ఫర్డ్ రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్పైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే కోతులపై జరిపిన ప్రయోగాలు ఆశాజనక ఫలితాలివ్వడంతో.. ఏప్రిల్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభించారు. జులై లేదా ఆగస్టు నాటిని పూర్తి ఫలితాలు అందుబాటులోకి రానున్నాయని హిల్ అంచనా వేశారు. మానవులపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలపై స్పందిస్తూ.. ‘‘ప్రయోగం జరుగుతున్న సమయంలో ఫలితాలపై వ్యాఖ్యానించడం సరైంది కాదు. అయితే, ప్రయోగాలు ఇంకా జరుగుతున్నాయంటే ఇప్పటి వరకు నిరాశపరిచే అంశాలేవీ లేవని మీరు అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు.
ChAdOx1 వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఏడు తయారీ కేంద్రాలకు ఉందని హిల్ తెలిపారు. వాటిలో ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ఒకటి కావడం విశేషం. ఈ సంస్థ ఆక్స్ఫర్డ్తో కలిసి పరిశోధనల్లో క్రీయాశీలకంగా పాల్గొంటోంది. మరిన్ని కేంద్రాలు చైనా, ఐరోపా దేశాల్లో ఉన్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం