ఆక్స్ఫర్డ్ టీకా మరో అడుగు ముందుకు..!
కరోనావైరస్కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలు మొదలు కానున్నట్లు
రెండో దశకు ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు
లండన్: కరోనావైరస్కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. తొలిదశలో 1,000 మందికి ఇమ్యూనైజేషన్ చేసినట్లు పేర్కొంది. వారి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో దశలో 10,260 మందిపై దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 56 ఏళ్లు పైబడిన వారు, 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది పూర్తయితే మూడో దశ కూడా మొదలుపెట్టనున్నట్లు ఆక్స్ఫర్డ్ తన వెబ్సైట్లో పేర్కొంది. దీనిలో 18ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగించి ఎలా పనిచేస్తోందో తెలుసుకొంటారు.
ఏమిటీ ఆక్స్ఫర్డ్ టీకా..?
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ChAdOx1 nCoV-19 పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. దీనిలో వినియోగించిన అడినో వైరస్ను చింపాజీల నుంచి సేకరించారు. వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి సార్స్ కోవ్2లో ఉండే స్పైక్ ప్రొటీన్ వంటిదానిని ఏర్పాటు చేశారు. ఈ వైరస్ శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించి వ్యాపించదు. దీనిని చూసి శరీరం రోగనిరోధక శక్తిని తయారు చేసుకొనేలా ప్రేరేపిస్తుంది.
ఈ టీకాను తీసుకొన్న ఆరు రీసెస్(ఆసియా జాతి) కోతులు వైరస్ను నిలువరించాయి. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. దీంతో ఈ టీకా నమ్మకమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే మనుషులపై మొదటి దశ టీకా ప్రయోగాలు పూర్తి అయ్యాయి. వీటిలో అవి మనుషలపై చూపించే ప్రభావాన్ని అంచనావేస్తున్నారు.
రెండు, మూడో దశలే కీలకం..
ఈ ప్రయోగాల్లో రెండు, మూడో దశలే కీలకం. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వారిలో కొందరికే కరోనావైరస్ కోసం చేసిన ChAdOx1 nCoV-19 టీకా ఇస్తారు. మిగిలిన వారికి MenACWY అనే టీకా ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చింది తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.
MenACWY అంటే ఏమిటీ..?
ఒక రకమైన మెనుంజైటీస్కు కారణమయ్యే ఏ, సీ, డబ్ల్యూ, వై, అనే బాక్టిరియా ఇన్ఫెక్షన్లకు కారణం కాకుండా బ్రిటన్లో వాడే టీకా ఇది. 2015 నుంచి అక్కడ వినియోగిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ టీకా చేయించుకొంటే కొంచెం వాపు, జ్వరం వంటివి వస్తున్నాయి. MenACWY చేయించుకొన్నా అలాంటి లక్షణాలే ఉంటాయి. ఈ ప్రయోగంలో ఎవరికి ఏ టీకా చేశారో తెలియకుండా ఇద్దరిలో ఒకే లక్షణాలు చూపించేలా ఉండేందుకు MenACWYను ఎంపిక చేశారు. అదే సెలైన్ నీరు ఎక్కిస్తే వారిలో ఎటువంటి వాపు, జ్వరం రాదు. అప్పుడు వారికి ఆక్స్ఫర్డ్ టీకా చేయలేదని తేలిపోతుంది.
ఈ ప్రయోగాల్లో ఏమి పరీక్షిస్తారు..?
కొవిడ్-19కు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్ఎఫెక్ట్లు లేవని నిరూపించాలి. మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. వీరు టీకా వేయించుకొన్న ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాలి. వీరిలో కొంత మందిని కొవిడ్ నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపమని చెబుతారు. ఈ నమూనాలు సేకరించిన వారిలో కొవిడ్ లక్షణాలు ఏమైనా కనిపించాయేమో పరీక్షిస్తారు. వారి ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయి..
ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న కొందరిలో కొవిడ్ లక్షణాలు కనబడితే ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉంటే వెంటనే ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు లక్షణాలు కనిపించిన వారు ఆక్స్ఫర్డ్ టీకా తీసుకొన్నారా..? MenACWY టీకా తీసుకొన్నారా విశ్లేషిస్తారు. ఆక్స్ఫర్డ్ టీకా తీసుకొన్న వారిలో సానుకూల ఫలితాలను బట్టి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి కొవిడ్ బారిన పడే అవకాశం ఉన్న చోట్ల విధులు నిర్వహిస్తున్న వారినే ఎంపిక చేసుకొన్నారు. వీరిలో వైద్య సిబ్బంది, ఇతర కీలక విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ