Gaza: ఆగని విధ్వంసకాండ
హమాస్ తీవ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం కూడా ఉద్ధృత స్థాయిలో వైమానిక దాడులు చేసింది.
ఉద్ధృతంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజా నుంచి హమాస్ రాకెట్ల ప్రయోగం
గాజా సిటీ: హమాస్ తీవ్రవాదుల అంతమే :లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం కూడా ఉద్ధృత స్థాయిలో వైమానిక దాడులు చేసింది. గాజా నగరంలో విద్యా సంస్థలు, పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్న ఆరు అంతస్తుల భవనాన్ని మంగళవారం నేలమట్టం చేసింది. అందులో ఉంటున్నవారిని ముందుగానే హెచ్చరించి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. హమాస్ కమాండర్ల నివాసాలు సహా 65 లక్ష్యాలపై సైనిక దళాలు దాడులు నిర్వహించి, ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దీనిలో 60కి పైగా జెట్ విమానాలు పాల్గొన్నట్లు ప్రకటించింది. దాడుల కారణంగా వైద్య సేవలకూ తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. మరోవైపు హమాస్ సంస్థ కూడా ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. దక్షిణ ఇజ్రాయెల్పై జరిగిన రాకెట్ దాడిలో థాయిలాండ్కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్లో అంతర్గత ఘర్షణలు చెలరేగాయి. ఇజ్రాయెల్లోని వివిధ పట్టణాల్లో ఉంటున్న పాలస్తీనియన్లు ఒక్కటై నిరసనలకు దిగారు. సైనిక చెక్పోస్ట్పై రాళ్లు విసిరారు.
కాల్పుల విరమణకు బైడెన్ మద్దతు
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా.. అమెరికా కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణకు అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు పలికారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన ఫోన్ సంభాషణలో స్పష్టం చేసినట్లు తెలిపింది. దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రాంతీయ అరబ్ నేతలతో, పాలస్తీనా నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సంప్రదింపులు జరిపారు. గాజాలోని భవనాలపై జరిగిన దాడుల గురించి అమెరికా దృష్టికి ఇజ్రాయెల్ తీసుకువెళ్లింది. గాజా పునర్నిర్మాణానికి 50 కోట్ల డాలర్ల సాయం అందించనున్నట్లు ఈజిప్ట్ ప్రకటించింది.
38 వేల మంది గల్లంతు!
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలోని 38 వేల మంది పాలస్తీనా ప్రజల ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 41 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. గాజాలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని.. వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. గాజాలో పరిస్థితిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్కు మద్దతుగా చికాగోలోని భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. హమాస్ వర్గం.. యూదులపై ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు