Corona Effect: చదువులు ‘కరోనా’పాలు
పాఠశాల విద్యపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 26.45 కోట్లమంది విద్యార్థులు, 96.87
దేశవ్యాప్తంగా 26.45 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం
తెలంగాణలో టీవీలు, ఫోన్ల ద్వారా పాఠాలు విన్నవారు: 17,27,892
డిజటల్ పరికరాలు లేని విద్యార్థులు: 1,17,570
కేంద్ర విద్యాశాఖ నివేదిక వెల్లడి
ఈనాడు, దిల్లీ: పాఠశాల విద్యపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 26.45 కోట్లమంది విద్యార్థులు, 96.87 లక్షల మంది టీచర్లు, 15.07 లక్షల పాఠశాలలు దీని ప్రభావానికి లోనైనట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 66,65,475 మంది ఉండగా.. 3 నుంచి 10 తరగతుల విద్యార్థుల్లో 17,27,892 మంది టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా డీడీ, టీశాట్ (నిపుణ, విద్యాఛానళ్లు) ద్వారా 11,34,900 మంది; స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, కంప్యూటర్ల ద్వారా 2,22,680 మంది తరగతులు విన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 1,17,570 మంది విద్యార్థుల వద్ద ఎలాంటి డిజిటల్ పరికరాలు లేవని సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ ‘ఇనిషియేటివ్స్ బై స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ 2020-21 ఫర్ కంటిన్యూయింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
59 వేల వాట్సప్ గ్రూపులతో పర్యవేక్షణ
తెలంగాణలో టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల కోసం గ్రామపంచాయతీల వద్ద డిజిటల్ పాఠాలను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. టీచర్లు, స్వచ్ఛంద సేవకులు ఇళ్లకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పేర్కొంది. పిల్లల చదువులను పర్యవేక్షించి, మదింపు చేయడానికి రాష్ట్రంలో 59 వేల వాట్సప్ గ్రూప్లను పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో రూపొందించిన పాఠాలను ఏకకాలంలో డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా ప్రసారం చేసినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో
* 1-10 తరగతులు విద్యార్థులు: 81,36,933
* డిజిటల్ పరికరాలు లేనివారు: 2,01,568
* పరికరాలు ఉన్నా చాలామందికి సరైన నెట్వర్క్ సౌకర్యం అందుబాటులో లేదు.
* ఎక్కువమంది ఇళ్లలో టీవీలు ఉన్నా అవి చదువులకు ఉపయోగపడటంలేదు.
* విద్యార్థులకు 21,120 డిజిటల్ పరికరాలను (2,850 ల్యాప్టాప్లు, 18,270 ట్యాబ్లు) పంపిణీ చేశారు.
కొవిడ్ అనంతరం అమల్లోకి వచ్చిన కొత్త పద్ధతులు పిల్లల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల చాలామంది పిల్లల్లో నేర్చుకోవడం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నుంచి బయటపడాలంటే పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల సామర్థ్యాలను బలోపేతం చేయాలి. మొత్తంగా బోధన, చదువుల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.- కేంద్ర విద్యాశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు