China: ఆయుధం ఎరవేసి.. బంగ్లాదేశ్పై పట్టుకు చైనా యత్నాలు
భారత్ చుట్టుపక్కల తన ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకోవడానికి చైనా వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్ను తన ఉక్కు కౌగిలిలో బంధించేందుకు
భారత్కు పొరుగున ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యూహం
దిల్లీ: భారత్ చుట్టుపక్కల తన ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకోవడానికి చైనా వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్ను తన ఉక్కు కౌగిలిలో బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ దేశానికి ఆయుధాలు ఎరవేస్తోంది. తాజాగా 44 తేలికపాటి ‘వీటీ5’ యుద్ధట్యాంకులను సరఫరా చేస్తోంది. సమీప భవిష్యత్లో మరిన్ని ట్యాంకులకు ఆర్డర్ దక్కించుకునే వీలుంది. ఈ ఆయుధాలతో కనీసం మూడు రెజిమెంట్లు ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా..
సైనిక దళాలను ఆధునికీకరించాలని బంగ్లాదేశ్ గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చైనా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా నిలిచే అవకాశం ఉంది. 2017లో బంగ్లాదేశ్.. బీఎన్ నబజాత్ర, బీఎన్ జాయజాత్ర అనే రెండు జలాంతర్గాములను డ్రాగన్ నుంచి కొనుగోలు చేసింది. శక్తిమంతమైన టోర్పిడోలు, సాగర మందుపాతరలను ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉంది. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములపై గణనీయ స్థాయిలో దాడి చేయగలవు.
- బంగ్లాదేశ్ సైన్యం ప్రధానంగా వినియోగించే బీడీ-08 తుపాకులకు మూలం చైనాకు చెందిన టైప్-81 అసాల్ట్ రైఫిల్. డ్రాగన్ సాంకేతిక తోడ్పాటుతో వీటిని రూపొందించారు. ఇవి అద్భుతంగా పనిచేశాయి. 4.5 కిలోల బరువుండే ఈ ఆయుధం 500 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించగలదు. నిమిషానికి 720 తూటాలను పేల్చగలదు. పనితీరు విషయంలో ఇది ఏకే-47 సహా ప్రపంచంలోని అత్యుత్తమ రైఫిళ్లకు ఏ మాత్రం తీసిపోదు.
- బంగ్లాదేశ్కు టైప్-69 అనే ప్రధాన యుద్ధ ట్యాంకులనూ చైనాయే సరఫరా చేసింది. ఇవేకాక ట్యాంకు విధ్వంసక క్షిపణులు, రాకెట్లు, రాకెట్ చోదిత గ్రెనేడ్లు, మోర్టార్లు, శతఘ్నులు, విమాన విధ్వంసక తుపాకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లను అందించింది. బంగ్లాదేశ్ వైమానిక దళంలో ప్రధాన అస్త్రమైన చెంగ్డు ఎఫ్7 యుద్ధవిమానాలు కూడా చైనా నుంచి వచ్చినవే కావడం గమనార్హం.
ఆధునికం..
బంగ్లాదేశ్ ముద్రతో ఉన్న వీటీ5 ట్యాంకులు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నోరింకో పరిశ్రమలో కనిపించడంతో ఈ విషయం బయటపడింది. భారత్తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మోహరించిన టైప్ 15 ట్యాంకుల కన్నా ఇవి ఆధునికమైనవని, ఎన్నో మెరుగైన లక్షణాలు వాటిలో ఉన్నాయని సమాచారం.
- 30 టన్నుల బరువున్న ఈ ట్యాంకు చాలా సులువుగా ఎటుపడితే అటు కదులుతుంది.
- గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
- ఈ ట్యాంకులో 105 ఎంఎం స్మూత్బోర్ గన్, 12.7 ఎంఎం మెషీన్ గన్, 35 ఎంఎం గ్రెనేడ్ లాంచర్ వంటివి ఉన్నాయి.
- శత్రు దాడిని తట్టుకోగల అనేక రక్షణాత్మక అంశాలు దీని సొంతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
రెండు రోజులుగా ఆందోళన బాటపట్టిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఏఐఎక్స్) సిబ్బంది సమ్మెను విరమించారు. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు. -
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM