చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని లాక్కెళ్లిన మొసలి

చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని మొసలి లాక్కెళ్లింది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగర వద్ద కాళీ నదిలో ఆదివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని

Updated : 25 Oct 2021 08:05 IST

కార్వార, న్యూస్‌టుడే: చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని మొసలి లాక్కెళ్లింది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగర వద్ద కాళీ నదిలో ఆదివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని మోహీన్‌ మహమూద్‌ (15)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్థులు నది వద్దకు చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. మోహీన్‌ ఒడ్డున కూర్చుని చేపల కోసం గాలం వేస్తుండగా మొసలి లాక్కెళ్లిందని అతడి స్నేహితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని