China: జిన్పింగ్ గర్వించేలా ఆమె..!
హాంకాంగ్ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంగ్కాంగ్ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతం చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ
మినీ చైనాను తలపించేలా హాంకాంగ్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
హాంకాంగ్ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన ఉద్యమాన్ని చూసి భయంతో కన్నీటి పర్యంతమైన హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెరీ లామ్.. ఇప్పుడు విజృంభిస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లల్లో బంధిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా మెల్లగా ఈ ఆంక్షలను అలవాటు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. స్వేచ్ఛాయుత ప్రదేశంగా హాంకాంగ్కు ఉన్న గుర్తింపు కనుమరుగవుతోందన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల గ్వాంగ్జూలో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఆన్లైన్లో భావప్రకటనను నియంత్రించనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్, మీడియాను అదుపు చేస్తూ..
ఇంటర్నెట్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుత చట్టాలతో ప్రయోజనం లేదని కెరీ లామ్ అన్నారు. వేర్పాటువాదం, విష ప్రచారం చేసేవారిని అరికట్టేందుకు ‘ఫేక్ న్యూస్’ చట్టాన్ని మేలో అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిలో చట్టపరమైన అంశాలపై పరిశీలన జరుగుతోంది. దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ లా కూడా తయారు చేయడానికి హాంకాంగ్ సిద్ధమైపోయింది. ఇందులో ఇంటర్నెట్ ప్రొవైడర్లను కీలకమైన మౌలిక సదుపాయాలుగా వర్గీకరించనున్నారు. ఫలితంగా ఆన్లైన్ కంటెంట్పై ప్రభుత్వానికి బలమైన పట్టు లభిస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే చైనా ఆమోదించిన నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని హాంకాంగ్ అధికారులు ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద వేర్పాటువాదం, విదేశీ శక్తులతో కుమ్మక్కవ్వడం, తీవ్రవాదం వంటి వాటిని నేరాలుగా పరిగణించి శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. చైనా నుంచి హాంకాంగ్ను వేరు చేయడంపై మాట్లాడటం, రాయడం వంటివి చేయడం నేరం. అటువంటి మీడియా హౌసులను మూసివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో హాంకాంగ్ అధికారులు దీనిని కళాశాలలు, మ్యూజియంలు, సినీ నిర్మాతలపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడి పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి.
కీలక సంస్థలు పలాయనం..
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదే 47 విదేశీ సంస్థల ప్రాదేశిక ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్ నుంచి తొలగించారు. వీటిల్లో అమెరికా, జపాన్, ఫ్రాన్స్ దేశాల కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. 6 ప్రపంచ స్థాయి బ్యాంకులు, 4 అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు వీటిలో ఉన్నాయి. కానీ, 14 చైనా కంపెనీల రీజనల్ ఆఫీస్లు కొత్తగా వచ్చి చేరాయి. ‘‘చైనా ప్రధాన భూభాగంలో వ్యాపారం చేయడం ఎంత రిస్క్తో కూడుకున్నదో.. అంతే రిస్క్ హాంకాంగ్లో కూడా ఉందని భావిస్తున్నాం’’ అని ఓ అంతర్జాతీయ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ టైమ్స్ వద్ద వ్యాఖ్యానించారు. చైనాలో మాదిరిగా దీర్ఘకాలం సరిహద్దులు మూసివేయడం, కఠినమైన క్వారంటైన్ నిబంధనల కారణంగా కంపెనీలు ఈ ప్రాంతాన్ని వీడుతున్నాయి.
చైనా కబంధ హస్తాల్లోకి హాంకాంగ్..
* 1997లో హాంకాంగ్ నిర్వహణ బాధ్యతలను బ్రిటన్ నుంచి చైనాకు అప్పజెప్పారు. 2047 వరకు హాంకాంగ్ రాజ్యాంగం అమల్లో ఉండాలి.
* 2014లో ప్రజాస్వామ ఉద్యమైన అంబ్రిల్లా ఉద్యమం చోటు చేసుకొంది.
* 2019లో చైనాకు నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్లో ఈ బిల్లు ఉపసంహరిస్తామని హాంకాంగ్ సీఈవో కెరీ లామ్ ప్రకటించారు.
* 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తితో హాంకాంగ్ సరిహద్దులు మూసివేసింది. దీంతో చైనా, ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి.
* 2020 జూన్లో స్థానిక చట్టాలను పక్కకు తప్పిస్తూ బీజింగ్ నేషనల్ సెక్యూరిటీ లాను విధించింది.
* 2020లో ఐరోపా సంఘంతో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు, పరస్పర న్యాయ సహకార ఒప్పందాలను హాంకాంగ్ రద్దు చేసుకొంది.
* 2021 జనవరిలో 50 మందిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి జైల్లో వేసింది.
* 2021 మార్చిలో హాంకాంగ్ ఎన్నికల విధానంలో చైనా మార్పులు చేయడం మొదలుపెట్టింది.
* హాంకాంగ్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం రిస్క్గా పేర్కొంటూ అమెరికా 2021 జులైలో అడ్వైజరీ జారీ చేసింది.
* 2021 ఆగస్టులో సరిహద్దులను తెరవాలని ఐరోపా సమాఖ్య కోరింది.
* చైనాతో సరిహద్దులు తెరవడం తమ ప్రాధాన్యమని హాంకాంగ్ సీఈవో కెరీ లామ్ ప్రకటించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?