China: మన విద్యార్థులను డ్రాగన్ ఇంకా అనుమతించలేదు..
తమ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ASEAN(బ్రునె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం)దేశాలకు చెందిన ఒంటరి విద్యార్థులను చైనా వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. భారత్కు చెందిన విద్యార్థుల
దిల్లీ: తమ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థుల విషయంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ASEAN(బ్రునె, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం)దేశాలకు చెందిన ఒంటరి విద్యార్థులను చైనా వచ్చేందుకు అనుమతించబోతున్నట్లు ప్రకటించింది. అయితే.. భారత్కు చెందిన విద్యార్థుల విషయంలో మాత్రం డ్రాగన్ దేశం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
చైనాలో కరోనా వైరస్ ప్రబలిన వెంటనే అక్కడ చదువుకుంటున్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికిపైగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు చదువును కొనసాగించడానికి తిరిగి చైనాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆ దేశం మాత్రం విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. తాజాగా ASEAN దేశాలకు అనుమతిచ్చి.. భారత విద్యార్థులకు మొండిచేయి చూపింది. గతేడాది నుంచే భారతీయులకు వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానాసేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో 23వేల మంది విద్యార్థులు(వారిలో ఎక్కువగా మెడిసిన్ చదువుకునే విద్యార్థులే), వందల మంది వ్యాపారవేత్తలు చైనాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ.. విదేశీ విద్యార్థులను అనుమతించే అంశానికి చైనా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. విద్యార్థులను దేశంలోకి అనుమతించే విషయంలో కరోనా భద్రత ప్రమాణాలు పాటిస్తుందని, సమన్వయ పద్ధతిలో అనుమతులకు ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా