Afghanistan: ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్లండి.. లేదంటే నా ప్రాణాలు నేనే తీసుకుంటా!
తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన ఆ దేశంలో రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఏ క్షణం షరియా చట్టాన్ని అమల్లోకి తెస్తారేమోనని....
అఫ్గానిస్థాన్లో చిక్కుకున్న ఓ మహిళ ఆర్తనాదం!
కాబుల్: ‘‘ఏ కారు మా దగ్గర నుంచి వెళ్లినా.. ఎక్కడ వారు(తాలిబన్లు) మమ్మల్ని లాక్కెళ్లి చంపేస్తారేమోనని భయమేస్తోంది. నేను మళ్లీ నా పిల్లల్ని చూస్తానో.. లేదో.. కూడా తెలియడం లేదు’’ ఇది అఫ్గానిస్థాన్లో ఉన్న ఓ అమెరికా మహిళ ఆర్తనాదం. తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన ఆ దేశంలో రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఏ క్షణం షరియా చట్టాన్ని అమల్లోకి తెస్తారేమోనని అక్కడి మహిళలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
ఇక అఫ్గాన్ పౌర ప్రభుత్వానికి, అమెరికా బలగాలకు సహకరించిన వారి భయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారంతా ఇప్పుడు ఆ దేశం నుంచి బయటపడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వారంతా వారి జీవితాల్లో ఓ అద్భుతం జరగాలనే ఆశిస్తున్నారు! అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం వీరి తరలింపు ప్రాణాలతో చెలగాటమే అన్నారంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నివాసం నుంచి బయటకు వెళ్లి ఎయిర్పోర్టుకు చేరుకోవడం అంటే జీవితంతో చెలగాటమాడినంత పనవుతోంది. కాబుల్లోని ఏ ప్రాంతం నుంచైనా విమానాశ్రయానికి చేరుకోవాలంటే సాయుధులైన తాలిబన్ ఫైటర్లతో కూడిన 20 చెక్పోస్టులను దాటుకొని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఎవరిపైనైనా వారికి అనుమానం కలిగితే వారిని తాలిబన్లు అక్కడే కాల్చి పారేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ఓ మహిళ విమానాశ్రయానికి చేరుతున్న క్రమంలో తాలిబన్లు తనని కొట్టారని తెలిపారు. పక్కనున్న ఓ వ్యక్తిని అతని భార్యాపిల్లల ముందే కాల్చి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం తాను అఫ్గాన్కు చెందిన కొంతమంది పౌరులతో కలిసి ఓ ఇంట్లో తలదాచుకున్నానని తెలిపారు. బయటకు వస్తే ఎక్కడ కాల్చి చంపుతారేమోనని భయంగా ఉందన్నారు. ఎలాగైనా తమను రక్షించాలంటూ తీవ్ర దుఃఖంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ను వేడుకున్నారు. ఈ మేరకు ఆమె ఓ ఆడియో సందేశాన్ని అమెరికాకు చేరవేశారు. దీన్ని వెస్ట్ వర్జీనియాకు చెందిన చట్టసభ సభ్యురాలు కారోల్ మిల్లర్ కార్యాలయం బహిర్గతం చేసింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా సదరు మహిళలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకీ అత్యంత దయనీయంగా మారుతున్నాయని.. ఆశలు కోల్పోతున్నామని ఆ మహిళ ఆవేదన చెందారు. ఇంటింటికీ వెళుతూ.. అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేసిన వారిని చుట్టుముడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాలిబన్లకు చిక్కడం కంటే.. తన జీవితాన్ని తానే అంతం చేసుకుంటానంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గంట గంటకి బతకడం కష్టంగా మారుతోంది. తాలిబన్లు ఏ క్షణమైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారనిపిస్తోంది. బైడెన్.. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. మాకు మీ సాయం కావాలి’’ అంటూ కన్నీటితో అర్థించారు.
ఆ మహిళ భర్త, కుటుంబ సభ్యులు ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నారు. ఏ క్షణం అఫ్గాన్లో ఇంటర్నెట్పై ఆంక్షలు విధిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే.. సంబంధాలు తెగిపోయి అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు బయటి ప్రపంచానికి తెలియవని కలవరపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్లో ఉన్న అమెరికా పౌరులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఆదేశాలు అందే వరకు ఎవరూ కాబుల్ ఎయిర్పోర్టుకు రావొద్దని స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు అమెరికా మొత్తం 17 వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించింది. వీరిలో 2,500 మంది అమెరికా పౌరులు ఉన్నారు. అఫ్గాన్లో 15000 మంది అమెరికా పౌరులు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరి తరలింపు కోసం మొత్తం 5,200 మంది సైనికులు పనిచేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు, విమానాశ్రయం చుట్టూ తాలిబన్ ఫైటర్ల పహారా.. తరలింపు ప్రక్రియను ఆటంకపరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్