ByPolls: ఓటేసిన దీదీ.. 4చోట్ల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం!
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ....
కోల్కతా/భువనేశ్వర్: పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల సమయానికి 53.32శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, షంషేర్గంజ్ స్థానంలో 78.60శాతం పోలింగ్ నమోదు కాగా.. జంగీపూర్లో 76.12శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఒడిశాలోని పూరీ జిల్లా పిప్లీ నియోజకవర్గంలో 68.40శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్కే లోహాని తెలిపారు. బెంగాల్లోని మూడు నియోజకవర్గాల్లో 6,97,164మంది ఓటర్లు ఉండగా.. పిప్లీలో 2.3లక్షల మందికి పైగా ఉన్నారు. సీఎం మమతా బెనర్జీ మిత్రా ఇన్స్టిట్యూషన్ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తృణమూల్, భాజపా పరస్పర ఫిర్యాదులు
భవానీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలవగా.. భాజపా నుంచి ప్రియాంక టిబ్రేవాల్, సీపీఎం నుంచి శ్రీజిబ్ విశ్వాస్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ, భాజపా అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు వార్డు నంబర్ 72లోని ఓ పోలింగ్ బూత్లో ఓటింగ్ ప్రక్రియను బలవంతంగా అడ్డుకున్నట్టు భాజపా అభ్యర్థి ప్రియాంక ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, అవన్నీ నిరాధార ఆరోపణలేనని మంత్రి హకీమ్ కొట్టిపారేశారు. ఓడిపోతామని తెలిసే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. అలాగే, భవానీపూర్లోని ఓ పోలింగ్ బూత్ బయట భాజపా, టీఎంసీ మద్దతుదారులకు స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ నకిలీ ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి తీసుకొస్తోందని భాజపా ఆరోపించడం స్వల్ప ఘర్షణకు దారితీయగా.. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ కూడా భాజపా అభ్యర్థి ప్రియాంకపై ఈసీకి ఫిర్యాదు చేసింది. టిబ్రేవాల్ తన పరివారంతో 20 కార్లలో తిరుగుతూ ఓటర్లను భయపెట్టారని టీఎంసీ నేతలు ఆరోపించగా.. వాటిని ఆమె తోసిపుచ్చారు.
అక్టోబర్ 3న ఫలితాలు
ఇకపోతే, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల అధికారి తెలిపారు. కొవిడ్ నిబంధనలతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు 348 పోలింగ్ బూత్లలో మాక్ పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైందని వివరించారు. 2000మందితో భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడి కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్