గాలిలో వైరస్ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?
గాలిలో వైరస్ ప్రభావం ఎంత దూరం ఉంటుందనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మరోసారి స్పష్టతనిచ్చింది.
అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాలు
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మరోసారి స్పష్టతనిచ్చింది. వైరస్ సోకిన వ్యక్తినుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని.. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.
మూడు విధాల్లో వైరస్ వ్యాప్తి
వైరస్ సోకిన వ్యక్తులనుంచి శ్వాసించినప్పుడు వెలువడే స్వల్ప శ్వాసబిందువుల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇది 3 నుంచి ఆరు అడుగుల లోపల ఈ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సీడీసీ స్పష్టంచేసింది. వైరస్ వ్యాప్తి మూడు విధాలుగా సీడీసీ వర్గీకరించింది. 1 అతిచిన్న శ్వాసకోస కణాలను నేరుగా పీల్చడం, 2 వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నేరుగా ఇతరుల ముక్కు, నోరు వంటి శ్లేష్మ పొరలపై వైరస్ కణాలు చేరడం 3. వైరస్తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం వల్ల వైరస్ మరొకరికి సంక్రమించే అవకాశాలను సీడీసీ విశ్లేషించింది.
వెంటిలేషన్ లేని ప్రాంతాల్లోనే..
శ్వాసించినప్పుడు లేదా తుమ్మడం, దగ్గడంవల్ల విడుదలయ్యే సూక్ష్మబిందువుల్లో కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి అత్యంత తొందరగా(సెకన్ల నుంచి నిమిషాల్లోనే) నేలపై పడిపోతాయి. కానీ, అత్యంత స్వల్ప పరిమాణంలో మిగిలిపోయిన కణాలు మాత్రం ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు గాలిలోనే క్రియాశీలంగా ఉంటాయి. అవి గాలిలో ఎంత సమయం ఉంటాయనే దానిపై ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి భౌతికంగా దూరంగా ఉన్నప్ప్పుడు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుందని సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. భౌతిక దూరం ఆరు అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే వైరస్ సంక్రమణ చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా గాలి బయటకు వెళ్లలేని (వెంటిలేషన్) లేని ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. వైరస్ సోకిన వ్యక్తి ఇండోర్ ప్రదేశాల్లో 15 నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తి ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక కొన్ని కేసుల్లో వైరస్ సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో వెంటనే వెళ్లిన వాళ్లలో వైరస్సోకే ప్రమాదం ఉంటుందని సీడీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
అందుకే మాస్కు, భౌతిక దూరాలే కీలకం..
కరోనా వైరస్ గాలిలోనూ వ్యాపిస్తుందని తేలిన నేపథ్యంలో మాస్కులు ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం, సరిపడ వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవడం, ఇండోర్ ప్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం కొవిడ్ వ్యాప్తిని నిర్మూలించడంలో ఉత్తమమైన మార్గాలు అని అమెరికా సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో కీలకమని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ