US: ఒబామా వలస విధానం చట్టవిరుద్ధం
అమెరికాలో ఒబామా హయాంలో తీసుకొచ్చిన వలస విధానం చట్టవిరుద్ధమంటూ
టెక్సాస్ న్యాయమూర్తి తీర్పు
అపీల్కు వెళ్తామన్న అధ్యక్షుడు బైడెన్
హూస్టన్: అమెరికాలో ఒబామా హయాంలో తీసుకొచ్చిన వలస విధానం చట్టవిరుద్ధమంటూ టెక్సాస్లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ హానెన్ శుక్రవారం తీర్పు చెప్పారు. నాటి విధానం 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులకు రక్షణ కవచంలా నిలిచిందని అభ్యంతరం చెప్పారు. తాజా తీర్పు.. ‘డ్రీమర్స్’కు చట్టబద్ధమైన రక్షణ, పౌరసత్వం కల్పించాలనుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం ప్రయత్నాలకు విఘాతంగా మారింది. ఈ తీర్పుపై అపీల్కు వెళ్తామని బైడెన్ ప్రకటించారు. ఒబామా హయాంలో 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన మైనర్లు (డ్రీమర్లు)పై బహిష్కరణ చర్యలు చేపట్టకుండా తగిన రక్షణ కల్పిస్తారు. ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత ఏడాది ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ డీఏసీఏ చట్టం అమలుపై మరో అడుగు ముందుకేసి డ్రీమర్లకు పౌరసత్వం కల్పించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. టెక్సాస్, మరో ఎనిమిది రిపబ్లికన్ పార్టీ ఆధిక్య రాష్ట్రాలు కలిసి టెక్సాస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
నాటి అధ్యక్షుడు ఒబామా పరిపాలనా యంత్రాంగం తన పరిధులు అతిక్రమించి డీఏసీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇకపై దేశ భద్రతా విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ) డీఏసీఏ తరహా చట్టాలు తయారు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకోవాలని కూడా న్యాయమూర్తి సూచించారు. అమెరికా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా డీఏసీఏ కింద రక్షణ పొందుతుండగా, కాలిఫోర్నియా, టెక్సాస్లలో చెరో లక్ష మందికి పైగా ఉన్నారు. తాజా తీర్పు డీఏసీఏ రక్షణ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిపై ప్రభావం చూపనుంది. కోర్టు తీర్పుపై అధ్యక్షుడు బైడెన్తో పాటు అధికార డెమొక్రాట్లు పెదవివిరిచారు. టెక్సాస్ ఫెడరల్ న్యాయమూర్తి తీర్పు తమను తీవ్రంగా నిరాశ పరిచిందని బైడెన్ అన్నారు. దీనిపై తమ న్యాయ విభాగం అపీల్కు వెళ్తుందని ప్రకటించారు. ఇప్పటికైనా వలసదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ను ఆయన మరోసారి కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)